Hyderabad: గోల్కొండ బోనాల ఎఫెక్ట్.. ఈ రూట్‌లలో జులై 26 వరకు ట్రాఫిక్ ఆంక్షలు!

నగరంలోని వాహనదారులకు హైరదాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కీలక సూచనలు చేశారు. శ్రీ జగదంబ మహంకాళి గొల్కొండ బోనాల ఉత్సవాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని స్పష్టం చేశారు. కాబట్టి ఆ రూట్‌లో ప్రయాణించే వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Hyderabad: గోల్కొండ బోనాల ఎఫెక్ట్.. ఈ రూట్‌లలో జులై 26 వరకు ట్రాఫిక్ ఆంక్షలు!
Golconda Bonalu

Updated on: Jul 17, 2026 | 12:01 PM

హైదరాబాద్‌లోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులక కీలక సూచనలు చేశారు. శ్రీ జగదంబ మహంకాళి గొల్కొండ బోనాల ఉత్సవాల దృష్ట్యా, జూలై 19, 23, 26 తేదీలలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొన్ని మార్గాలలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని స్పష్టం చేశారు. గోల్కొండ కోటకు వెళ్లే మార్గాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున.. రామ్‌దేవ్‌గూడ నుండి మక్కై దర్వాజా మీదుగా, లంగర్ హౌజ్ నుండి ఫతే దర్వాజా మీదుగా, షేక్‌పేట్ నాలా నుండి బంజారా దర్వాజా మీదుగా వచ్చే వాహనదారులు కింద ఇవ్వబడిన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని తెలిపారు.

పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే

నార్సింగి, సన్ సిటీ, లంగర్ హౌజ్ నుండి షేక్‌పేట్ – ఫిల్మ్ నగర్ – గచ్చిబౌలి మీదుగా మక్కై దర్వాజా- గోల్కొండ కోట – బంజారా దర్వాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ను రామ్‌దేవ్‌గూడ వద్ద లంగర్ హౌస్ – బాలికా భవన్ – నానల్ నగర్ వైపు మళ్లిస్తారు.

ఫిల్మ్ నగర్, షేక్‌పేట్ నుండి బంజారా దర్వాజ – మక్కై దర్వాజ మీదుగా వచ్చే ట్రాఫిక్ బంజారా దర్వాజా వెలుపల అల్జాపూర్ రోడ్ – నెక్నాంపూర్ వైపు మళ్లించనున్నారు.

మొఘల్ కా నాలా నుండి లంగర్ హౌజ్ – ఫతే దర్వాజా – గోల్కొండ కోట మీదుగా వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను లంగర్ హౌజ్ ఎక్స్ రోడ్ వద్ద బాలికా భవన్ – నానల్ నగర్ వైపు మళ్లిస్తారు.

భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు

ఇదిలా ఉండగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ఉండేందకు భక్తల కోసం అధికారులు ప్రత్యేక పార్కింట్ స్లాట్స్ ఏర్పాటు చేశారు. రామ్‌దేవ్‌గూడ నుండి మక్కై దర్వాజా మీదుగా గోల్కొండ కోట వైపు వచ్చే భక్తుల ద్విచక్ర వాహనాలను అషూర్ ఖానా నుండి ఆర్మీ సెంటి పోస్ట్ వరకు పార్క్ చేయవచ్చు, మిగిలిన వాటిని ఆర్టిలరీ సెంటర్ వద్ద పార్క్ చేయవచ్చని పోలీసులు తెలిపారు

ఇక లంగర్ హౌజ్ నుండి ఫతే దర్వాజా మీదుగా గోల్కొండ కోట వైపు వచ్చేవారు తమ బైక్‌లను హుడా పార్క్, గవర్నమెంట్ స్కూల్, ఒవైసీ గ్రౌండ్‌లో పార్క్ చేయాలని సూచించారు.అయితే ఆటో, కార్లను కేవలం ఒవైసీ గ్రౌండ్‌లో మాత్రమే పార్క్ చేయాలని సూచించారు.

షేక్‌పేట్ నుండి బంజారా దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు వచ్చే భక్తులు తమ బైక్‌లను గోల్కొండ ఏరియా హాస్పిటల్ వద్ద పార్క్ చేయాలని, కార్లు, లేదా ఆటోలను హాకీ గ్రౌండ్, ఒవైసీ గ్రౌండ్, డెక్కన్ పార్క్‌లలో పార్క్ చేయవచ్చని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us