Telangana: 700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత మీకు తెలుసా?

ఆ గ్రామంలో ఓ పురాతన ఆయలం ఉంది. శీతారాములుకొలువై ఉన్న ఈ ఆలయంలో ఉన్న దీపం నిరంతరం వెలుగుతూనే ఉంది. దాన్ని వెలిగించి దాదాపు 700 ఏళ్లు దాటిన ఇంకా ఆ దీపం కొండెక్కలేదు.. ఆ నాటి నుంచి నేటి వరకు చెక్కుచెదరకుండా ప్రకాశిస్తూనే ఉంది. ఇంతకు ఆ ఆలయం ఎక్కడుందనేగా మీ డౌట్.. అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: 700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత మీకు తెలుసా?
Gambhiraopet Sitaram Temple

Edited By:

Updated on: Apr 01, 2026 | 6:15 PM

అది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామాలయం.. ఈ ఆలంలో స్వామి వారి ముందు ఉన్న నందా అనే దీపం సుమారు 700 ఏళ్లుగా ఆరని దివ్య జ్యోతిగా భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ దీపం కేవలం ఒక వెలుగు కాదు, శతాబ్దాల విశ్వాసానికి నిలువెత్తు ప్రతీకగా అక్కడి భక్తుల నమ్మకం. ఇదే ఆ గ్రామానికి ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. క్రీస్తూ పూర్వం.. 1,314వ సంవత్సంలో కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు గుడిలోని శాసనాల ద్వారా తెలుస్తోంది.

700 ఏళ్లుగా వెలుగుతున్న దీపం

ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే మూల విగ్రహాల ప్రతిష్ఠకు ముందే ఇక్కడ నందా దీపాన్ని ప్రతిష్ఠించారట. అప్పటి నుంచి నేటి వరకు ఈ దీపం ఆరకుండా ప్రకాశిస్తూనే ఉందట. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ దీపానికి నూనెను సమర్పిస్తూ దాని జ్వాలను ఆరిపోకుండా చూసుకుంటున్నారట.తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందట. గ్రామస్థుల విశ్వాసం ప్రకారం ఈ జ్యోతి వెలుగుతుండటం వల్ల గ్రామంలో ఐశ్వర్యం, పంటలు, శాంతి నిలుస్తాయట. ఇది దైవ అనుగ్రహానికి ప్రత్యక్ష రూపంగా గ్రామస్తులు భావిస్తారు.

కాకతీయుల కళా వైభవం.

ఈ ఆలయం నిర్మాణం కేవలం భక్తి కట్టడం మాత్రమే కాదు. శిల్పకళకు కూడా మహోన్నతికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఆలయంలో 16, 18 రాతి స్తంభాలతో అద్భుత మండపాలు, చతురస్రాకార నిర్మాణ శైలి. శిల్పాల్లో కనిపించే నిగూఢమైన నైపుణ్యం. ఈ నిర్మాణం కాకతీయుల కాలపు కళాత్మక ప్రతిభను ప్రతిబింబిస్తూ, చరిత్రను జీవంతంగా నిలబెడుతోంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. 9 రోజుల పాటు నవాహ్నిక బ్రహ్మోత్సవాలు సీతారామ కళ్యాణం.. భద్రాచలం తరహాలో ఘనంగా అశ్వ, గజ, గరుడ, హనుమాన్, శేష వాహన సేవలు.. రథోత్సవం, ఏకాంత సేవ వంటికి జరుపుతారు. ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా హాజరవుతారు.

అన్నదాన కార్యక్రమాలు

ఈ ఉత్సవాల సమయంలో దాతల సహకారంతో నిర్వహించే అన్నదానం ఈ ఆలయ ప్రత్యేకత. గ్రామస్థులు సమిష్టిగా భాగస్వామ్యం వహిస్తూ ప్రతి భక్తునికి సేవ చేయడం ఈ క్షేత్ర ఆధ్యాత్మికతను మరింత పెంచుతోంది. గత కొన్నేళ్లుగా గ్రామ ప్రజల సహకారంతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టడం ద్వారా ఆలయం మరింత శోభాయమానంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us