కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఊరట

కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఊరట లభించింది. జూబ్లీహిల్స్ పోలీసులను ఇంట్లో నిర్బంధించి దూషించిన కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం రూ.25,000 చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. పోలీసుల విచారణకు సహరించాలని ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సూచించింది. అలాగే ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయరాదని బంజారాహిల్స్ పోలీసులకు స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొండా అనుచరుడు సందీప్ రూ.10 లక్షలతో పోలీసులకు […]

కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఊరట
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2019 | 4:06 PM

కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఊరట లభించింది. జూబ్లీహిల్స్ పోలీసులను ఇంట్లో నిర్బంధించి దూషించిన కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం రూ.25,000 చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. పోలీసుల విచారణకు సహరించాలని ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సూచించింది. అలాగే ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయరాదని బంజారాహిల్స్ పోలీసులకు స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొండా అనుచరుడు సందీప్ రూ.10 లక్షలతో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ వ్యవహారంలో నోటీసులు అందించేందుకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లగా, ఆయన తన అనుచరులతో తమను నిర్బంధించారని ఎస్సై కృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.