
Central Govt Warns: వాట్సాప్ అనేది విస్తృతంగా ఉపయోగించే కమ్యూనికేషన్ యాప్లలో ఒకటి. వాట్సాప్ వెబ్ రాకతో దీనిని వ్యాపార రంగంలో కూడా చురుకుగా ఉపయోగిస్తున్నారు. అయితే, వాట్సాప్ వెబ్ను ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం కొన్ని భద్రతా హెచ్చరికలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రధాని మోదీ రైతులకు బంపర్ గిఫ్ట్.. మరో కొత్త స్కీమ్.. త్వరలో ప్రారంభం..!
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ప్రకారం.. WhatsApp వెబ్ డేటా లీకేజీకి గురయ్యే అవకాశం ఉంది. కార్పొరేట్ పరికరాల్లో WhatsApp వెబ్ను ఉపయోగించడం వల్ల వ్యక్తిగత సమాచారం మాత్రమే కాకుండా ముఖ్యమైన కంపెనీ సమాచారం కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది. స్క్రీన్ మానిటరింగ్, మాల్వేర్, బ్రౌజర్ హైజాకింగ్ వంటి భద్రతా బెదిరింపులు WhatsApp వెబ్ వినియోగదారులకు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. వీటిపై 75 శాతం రాయితీ!
మీరు ఆఫీస్ వై-ఫై ఉపయోగించినప్పుడు మీ కంపెనీ మీ వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయగలదు. అదనంగా వాట్సాప్ వెబ్ను ఉపయోగించే పరికరాలు పోయినట్లయితే పెద్ద డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది.
ముందుజాగ్రత్తలు:
కంపెనీ భద్రతా ప్రమాణాలను పాటించడం ముఖ్యం. సమయానికి సెక్యూరిటీ అప్డేట్లను నిర్వహించడం కూడా భద్రతను నిర్ధారించడంలో సహాయపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి