
బ్లూమ్బెర్గ్ నివేదికల ప్రకారం జె510 కోడ్నేమ్తో రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త ఐప్యాడ్ మినీ మెరుగైన రంగులు, హై కాంట్రాస్ట్, అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించనుంది. ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్ మోడల్స్తో పాటు రాబోయే ఈ సరికొత్త టెక్నాలజీ డివైజ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ప్రముఖ యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్కు మార్కెట్లో ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఐఫోన్లతో పాటు యాపిల్ ఇతర ఉత్పత్తులు కూడా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఐప్యాడ్ మినీ’ని మరింత అడ్వాన్స్డ్ ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకురావడానికి ఆ సంస్థ సిద్ధమవుతోంది.
బ్లూమ్బెర్గ్కు చెందిన ప్రముఖ మార్క్ గుర్మాన్ నివేదిక ప్రకారం.. యాపిల్ కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్పై పూర్తిగా ఫోకస్ పెట్టింది. దీని అంతర్గత కోడ్నేమ్ J510గా ఉంది. 2021 తర్వాత ఈ పరికరానికి ఇదే మొదటి అతిపెద్ద అప్డేట్ కానుంది. సరికొత్త ఐప్యాడ్ మినీలో తొలిసారిగా ఓఎల్ఈడీ (OLED) డిస్ప్లేను ఇస్తున్నారు. ఇది ప్రస్తుత ఎల్సీడీ స్క్రీన్ కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. మరింత మెరుగైన రంగులు, ఎక్కువ కాంట్రాస్ట్ మరియు అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ లభిస్తాయి. ఇంతకుముందు కేవలం హై-ఎండ్ ప్రో మోడల్స్లో మాత్రమే ఈ ఓఎల్ఈడీ టెక్నాలజీని వాడేవారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఐప్యాడ్ మినీతో పాటు ఐప్యాడ్ ఎయిర్ మోడల్స్లో కూడా ఓఎల్ఈడీ స్క్రీన్ వస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే సాధారణ ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్ మోడల్లో మాత్రం ధరను సాధ్యమైనంత తక్కువగా ఉంచే ఉద్దేశంతో ఎల్సీడీ డిస్ప్లేనే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు సరికొత్త యాపిల్ పెన్సిల్ను కూడా త్వరలో లాంచ్ చేయడానికి ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త డివైజ్ల ద్వారా వినియోగదారులు సరికొత్త టెక్నాలజీ అనుభూతిని ఆస్వాదించవచ్చు.
యాపిల్ కేవలం ఐప్యాడ్ మినీకి మాత్రమే పరిమితం కాకుండా, కొత్త ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్పై కూడా తీవ్రంగా కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ కొత్త ఐప్యాడ్ భారత మార్కెట్తో పాటు గ్లోబల్ మార్కెట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త మోడల్లో అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ను అందించనున్నారు. దీనివల్ల ఐప్యాడ్ పనితీరు మునుపటి కంటే చాలా వేగంగా, మెరుగ్గా ఉంటుంది. అయితే దీని డిజైన్లో మాత్రం గత వెర్షన్లతో పోలిస్తే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.