సుశాంత్ సూసైడ్.. 1.3 మిలియన్ మంది ఆలియాను అన్ఫాలో చేశారు..
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ముఖ్యంగా పలువురు స్టార్ కిడ్స్, నిర్మాత కరణ్ జోహార్ను నెటిజన్ల విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ముఖ్యంగా పలువురు స్టార్ కిడ్స్, నిర్మాత కరణ్ జోహార్ను నెటిజన్ల విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సుశాంత్ ఎంతో ప్రతిభావంతుడని.. అవకాశాలు రాకుండా తొక్కేశారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. నెపోటిజంపై హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పటి నుంచో యుద్ధం చేస్తోంది. తాజాగా ఆమె సుశాంత్ సూసైడ్ విషయంలో వారసులపై చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. ఫేవరెటిజం, నెపోటిజానికి ఫ్లాట్ బ్యారర్గా ఉండే వాళ్ల సినిమాలను నిషేదించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
అంతేకాకుండా వారిని అన్ఫాలో కావాలని కొందరు పిలుపునిచ్చారు. దీనితో చాలామంది బాలీవుడ్ పెద్దలు, స్టార్ కిడ్స్, కరణ్ జోహార్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో ఫాలోవర్స్ సంఖ్య మూడు రోజులుగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 3 రోజుల్లో ఆలియా భట్ను ఏకంగా 1.3 మిలియన్ మంది అన్ఫాలో చేయగా.. కరణ్ జోహార్ను 2 లక్షల మందిపైగా, సల్మాన్ ఖాన్ను 50 వేల మంది అన్ఫాలో చేశారు. కాగా, సుశాంత్ ఆత్మహత్యపై స్పందించిన కంగనా రనౌత్, హీరోయిన్ కృతి సనన్ సోషల్ మీడియా ఖాతాల్లో ఫాలోవర్స్ సంఖ్య గడిచిన మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతోంది.