విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
కాంగ్రెస్ నేతలకు సుప్రింకోర్టులో ఎదురుగదెబ్బ తగిలింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం కొట్టివేసింది. తెలంగాణ సచివాలయం భవనాలు కూల్చివేతకు హైకోర్టు జూన్ 29న అనుమతిచ్చింది. హైకోర్టుతీర్పును సవాల్ చేస్తూ జీవన్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ నేతలకు సుప్రింకోర్టులో ఎదురుగదెబ్బ తగిలింది. తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం కొట్టివేసింది. తెలంగాణ సచివాలయం భవనాలు కూల్చివేతకు హైకోర్టు జూన్ 29న అనుమతిచ్చింది. హైకోర్టుతీర్పును సవాల్ చేస్తూ జీవన్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం.. హైకోర్టు నిర్ణయంలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. సచివాలయం కూల్చివేతకు సంబంధించి తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.
పాత సచివాలయ భవనాల కూల్చివేతపై ఇప్పటికే హైకోర్టు సమగ్రంగా పరిశీలించిందని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా భవనాల నిర్మాణంపై నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయని, ఆర్టికల్ 136 ప్రకారం విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు మరో న్యాయవాది ఉదయ్కుమార్ సాగర్ వాదనలు వినిపించారు. విచారణకంటే ముందే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించింది. జీవన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.