ముందుంది మరీంత మండేకాలం..
రానున్నది మండేకాలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నుంచే బీ అలర్ట్ అంటూ సూచిస్తున్నారు. శివరాత్రి తర్వాత శివశివ అంటూ చలి వెళ్లిపోగా.. సూర్యుడికి భూ దక్షిణార్ధగోళం దగ్గరవుతోంది.
రానున్నది మండేకాలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నుంచే బీ అలర్ట్ అంటూ సూచిస్తున్నారు. శివరాత్రి తర్వాత శివశివ అంటూ చలి వెళ్లిపోగా.. సూర్యుడికి భూ దక్షిణార్ధగోళం దగ్గరవుతోంది. అందుకే ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ వేసవిలో నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపించనున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు.. 45 డిగ్రీలకు తాకుతాయని అంచనా వేసిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సారి సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 1 డిగ్రీ సెల్సియస్ వరకు అదనంగా నమోదుకానున్నాయని చెప్పారు. భూతాపంతో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులే దీనికి కారణమని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మార్చి రెండోవారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు.. మే నెలలో వడగాల్పులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వేసవి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు కోస్తాంధ్ర జిల్లాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో గరిష్ఠంగా 45 డిగ్రీలు, రాయలసీమ జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ను దాటొచ్చని అంటున్నారు. కాలుష్యం, అడవుల నరికివేత, జలవనరులు కుదించుకుపోవడం లాంటివి మార్పులకు కారణాలుగా చెబుతున్నారు.
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తీవ్రమైన వేసవితాపం, ఉక్కపోతలు తప్పవు. కాబట్టి… అందుకు తగ్గట్టు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలని సూచించారు. గాలి బాగా తగిలేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే… చిన్న పిల్లలు, వృద్ధులకు ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తవహించాలని చెబుతున్నారు. పండ్ల రసాలు, పౌష్టికాహారం తీసుకుంటూ… ఎక్కువగా నీరు తాగుతూ, ముఖాలకు స్కార్ఫులూ ధరించాలని నిపుణులు సూచించారు.