వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో 318 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లోని రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా.. అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పర్యటనల్లో ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్గా నిలిచాడు. నిజంగా ఇది చాలా అరుదైన రికార్డ్. వెస్టిండీస్తో తొలి టెస్టు గెలిచిన టీమిండియా.. టెస్టు ఛాంపియన్షిప్లో బోణీ కొట్టింది. రెండో మ్యాచ్ శుక్రవారం ప్రారంభమవుతుంది