Mayank Agarwal: విమానంలో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అస్వస్థతకు గురి కావడానికి అసలు కారణం వెల్లడైంది. నివేదికల ప్రకారం, మయాంక్ అగర్వాల్ ద్రవాన్ని నీరుగా భావించి తాగాడు. దీని కారణంగా అతను అనారోగ్యానికి గురయ్యాడు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంది. మయాంక్ అగర్వాల్ అధికారికంగా ఫిర్యాదు చేశారు.
మయాంక్ అగర్వాల్ ఢిల్లీకి వెళ్లే విమానంలో అగర్తల నుంచి రాజ్కోట్కు ప్రయాణించాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా అతనికి గొంతు నొప్పి, నోటిలో మంట మొదలైంది. ఆ తర్వాత భారత బ్యాట్స్మన్ వెంటనే అగర్తలాలో సమీపంలోని ఆసుపత్రిలో చేరాడు. మయాంక్ అగర్వాల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెబుతున్నారు.
త్రిపుర ఎస్పీ వెస్ట్ కిరణ్ కుమార్ పీటీఐతో మాట్లాడుతూ.. మయాంక్ అగర్వాల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇస్తూ ‘అంతర్జాతీయ ఆటగాడు మయాంక్ అగర్వాల్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అయితే, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని అతని మేనేజర్ ఫిర్యాదు చేశారు’ అంటూ తెలిపాడు.
మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో, జట్టు మొదటి 4 మ్యాచ్లలో 2 గెలిచింది. ఒక మ్యాచ్ ఓడిపోయింది. అయితే ఒక మ్యాచ్ డ్రా అయింది. ప్రస్తుత రంజీ ట్రోఫీలో అతని ఆరంభం ఫర్వాలేదు. పంజాబ్తో జరిగిన తొలి మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఖాతా తెరవలేకపోయిన అతడు.. ఆ తర్వాత 2 అద్భుత సెంచరీలు, 1 అర్ధ సెంచరీ సాధించాడు. 4 మ్యాచ్లు ఆడిన 7 ఇన్నింగ్స్ల్లో 310 పరుగులు చేశాడు.
మయాంక్ అగర్వాల్ భారత జట్టు తరపున 21 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఈ సమయంలో, అతను 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో సహా 1488 పరుగులు చేశాడు. మయాంక్ రెండేళ్ల క్రితం భారత్ తరపున టెస్టు మ్యాచ్లు ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..