Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా.. క్రికెట్‌లో స్వర్ణం గెలిచిన రుతురాజ్ సేన..

India vs Afghanistan, Final, Asian Games Men's T20I 2023: హాంగ్‌జౌలో శనివారం వర్షం కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్ మ్యాచ్ రద్దు కావడంతో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణం సాధించింది. టోర్నీలో టాప్ ర్యాంక్‌లో ఉన్న జట్టు కావడంతో భారత్‌కు స్వర్ణం లభించింది. ఎడతెగని వర్షంతో ఆట నిలిచిపోయింది. దీంతో చివరికి అధికారులు మ్యాచ్‌ను రద్దు చేయవలసి వచ్చింది.

Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా.. క్రికెట్‌లో స్వర్ణం గెలిచిన రుతురాజ్ సేన..
Indian Cricket Team

Updated on: Oct 07, 2023 | 3:06 PM

India vs Afghanistan, Final, Asian Games Men’s T20I 2023: ఏషియాడ్‌ పురుషుల క్రికెట్‌ టోర్నీలో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. వర్షం కారణంగా భారత్-ఆఫ్ఘనిస్థాన్ ఫైనల్ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. టాప్ ర్యాంకింగ్ కారణంగా టీమ్ ఇండియాను ఛాంపియన్‌గా ప్రకటించారు. జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పింగ్‌ఫెంగ్ మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అఫ్గానిస్థాన్ జట్టు 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసిన సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది.

ఈ స్వర్ణం సాయంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 27 స్వర్ణాలకు చేరుకుంది. ఇప్పటి వరకు భారత్ 102 పతకాలు సాధించింది.

ఇవి కూడా చదవండి

టాప్ బ్యాట్స్‌మెన్ జుబైద్ అక్బరీ..

5 పరుగులు, మహ్మద్ షాజాద్ 4 పరుగులు మరియు నూర్ అలీ జద్రాన్ 1 పరుగు చేసి తక్కువ ధరకే వెనుదిరిగారు. భారత్‌ తరఫున అర్ష్‌దీప్‌ సింగ్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలో వికెట్‌ తీశారు.

హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసే సరికి వర్షం మొదలైంది.

ఈ కుండపోత వర్షం కారణంగా పిచ్ పూర్తిగా తడిసిపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయించారు. దీంతో ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు. అయితే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాను విజేతగా ప్రకటించింది. దీంతో ఆసియా క్రీడల క్రికెట్‌లో భారత జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన అఫ్ఘానిస్థాన్‌ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక పాక్ జట్టును ఓడించిన బంగ్లాదేశ్ జట్టు కాంస్యం దక్కించుకుంది.

రెండు జట్ల ప్లేయింగ్ 11

భారత్‌: రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్) , యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, ఆర్ సాయి కిషోర్, రవి బిష్ణోయ్ మరియు అర్ష్‌దీప్ సింగ్.

ఆఫ్ఘనిస్తాన్: గుల్బాదిన్ నాయబ్ (కెప్టెన్), జుబైద్ అక్బరీ, మహ్మద్ షాజాద్, నూర్ అలీ జద్రాన్, షాహిదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, కరీం జనత్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మరియు జహీర్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..