IND vs AUS: ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టు ఇదే.. హార్దిక్ పాండ్యాకు కండీషన్స్ అప్లై.. ఎందుకంటే..?

India A vs Australia A Series Squad: ఆస్ట్రేలియా ‘A’తో జరగనున్న రెండు మల్టీడే, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ భారత్ ‘A’ జట్లను ప్రకటించింది. వన్డే జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కడం ఆసక్తికరంగా మారింది. అయితే అతడి ఎంపిక ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుంది. మల్టీడే జట్టుకు దేవదత్ పడిక్కల్, వన్డే జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

IND vs AUS: ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టు ఇదే.. హార్దిక్ పాండ్యాకు కండీషన్స్ అప్లై.. ఎందుకంటే..?
Ind Vs Aus Hardik Pandya

Updated on: Sep 09, 2026 | 4:29 PM

India A vs Australia A Series Squad: ఆస్ట్రేలియా ‘A’తో జరగనున్న సిరీస్‌కు భారత్ ‘A’ జట్లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. 2 మల్టీడే మ్యాచ్‌లు, 3 వన్డేలు ఈ సిరీస్‌లో ప్లాన్ చేశారు. అందరి దృష్టినీ ఆకర్షించిన అంశం వన్డే జట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు దక్కడం. అయితే ఈ ఆల్ రౌండర్ పాల్గొనడం ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. మల్టీడే జట్టులో ఎంపికైన విజయ్‌కుమార్ వైశాఖ్‌కు కూడా ఇదే నిబంధన వర్తించనుంది. మల్టీడే మ్యాచ్‌లకు దేవదత్ పడిక్కల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వన్డే జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించనున్నాడు. 50 ఓవర్ల జట్టులో పడిక్కల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. రెడ్ బాల్ ఫార్మాట్‌లో సాయి సుదర్శన్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.

ఇటీవల శ్రీలంక పర్యటనలో పడిక్కల్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. 3 ఇన్నింగ్స్‌ల్లో 328 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ (Player of the Tournament) అవార్డును అందుకున్నాడు. ఆ ప్రదర్శనతోనే భారత్ ‘A’ మల్టీడే జట్టుకు నాయకత్వ బాధ్యతలు కూడా దక్కాయి.

బ్యాటింగ్‌కు బలమైన ఎంపికలు..

మల్టీడే జట్టులో అమన్ మోఖాడే, ఆయుష్ పాండే, యశ్ రాథోడ్, షేక్ రషీద్ వంటి బ్యాటర్లకు చోటు లభించింది. వికెట్ కీపింగ్ కోసం కుమార్ కుశాగ్ర, ఎన్. జగదీశన్ ఎంపికయ్యారు. శామ్ ములానీ, తనుష్ కోటియన్, తుషార్ దేశ్‌పాండే, అన్షుల్ కాంబోజ్, ప్రఫుల్ హింగే, నచికేత్ భూటే, వి. వైశాఖ్ జట్టులో ఉన్నారు.

వన్డే జట్టులో ప్రియాంశ్ ఆర్య, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, నిషాంత్ సింధు, విప్రజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, నమన్ ధీర్, గుర్జప్నీత్ సింగ్, యశ్ ఠాకూర్‌లకు చోటు దక్కింది. కుమార్ కుశాగ్ర, ప్రభ్‌సిమ్రన్ సింగ్ వికెట్ కీపింగ్ ఆప్షన్లుగా ఉన్నారు.

పుదుచ్చేరిలో 5 మ్యాచ్‌లు..

భారత్ ‘A’, ఆస్ట్రేలియా ‘A’ మధ్య తొలి మల్టీడే మ్యాచ్ సెప్టెంబర్ 22న పుదుచ్చేరిలో ప్రారంభమవుతుంది. రెండో మల్టీడే మ్యాచ్ సెప్టెంబర్ 29న అదే వేదికపై జరుగుతుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో 3 వన్డే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌లో హార్దిక్ పాండ్యా, విజయ్‌కుమార్ వైశాఖ్ పాల్గొనాలంటే ఫిట్‌నెస్ క్లియరెన్స్ తప్పనిసరి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us