Team India Test Cricket History: ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 4వ రోజు బంగ్లాదేశ్ను 280 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా ఓటమి కంటే ఎక్కువ విజయాలను సాధించిన జట్టుగా నిలిచింది. బంగ్లా టైగర్స్పై విజయంతో టీమిండియా మొత్తంగా 581 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఈ 581 మ్యాచ్ల తర్వాత టీమిండియా ఇప్పుడు 179 విజయాలు, 178 ఓటములతో నిలిచింది.
బంగ్లాతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడకముందు రెడ్ బాల్ ఫార్మాట్లో భారత్ 179 విజయాలు, 179 ఓటములను కలిగి ఉంది. 1932లో లార్డ్స్లో ఇంగ్లండ్తో భారత్ తొలి టెస్టు ఆడింది. సీకే నాయుడు నేతృత్వంలోని భారత్ 158 పరుగుల తేడాతో ఇంగ్లిష్ చేతిలో ఓడిపోయింది.
1952లో చెన్నైలో ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్లో విజయం సాధించింది. అదే వేదికగా ఇప్పుడు భారత్ తన 179వ టెస్టును గెలుచుకుంది.
ఆస్ట్రేలియా: 414 విజయాలు, 232 ఓటములు
ఇంగ్లండ్: 397 విజయాలు, 325 ఓటములు
దక్షిణాఫ్రికా: 179 విజయాలు, 161 ఓటములు
భారత్: 179 విజయాలు, 178 ఓటములు
పాకిస్థాన్: 148 విజయాలు, 144 ఓటములు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్), మెహిదీ హసన్ మిరాజ్, నహిద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..