Team India: ఏడాదిలో ఆరుగురు కెప్టెన్లు, వైస్ కెప్టెన్లను మార్చిన బీసీసీఐ.. పూర్తి జాబితా చూస్తే పరేషానే..!

Team India: టీం ఇండియా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మాన్ గిల్‌ను కొత్త వన్డే కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అయితే, గత ఏడాది కాలంగా భారత జట్టు తరపున ఎంతమంది కెప్టెన్లు, వైస్ కెప్టెన్లను మార్చారో ఇప్పుడు చూద్దాం..

Team India: ఏడాదిలో ఆరుగురు కెప్టెన్లు, వైస్ కెప్టెన్లను మార్చిన బీసీసీఐ.. పూర్తి జాబితా చూస్తే పరేషానే..!
Team India

Updated on: Oct 05, 2025 | 5:38 PM

Team India Captains and Vice Captains List: ఆస్ట్రేలియా పర్యటనకు టీం ఇండియాను ప్రకటించిన వెంటనే, రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి, శుభ్‌మాన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించారు. మొత్తంగా శుభ్‌మాన్ గిల్‌ 28వ వన్డే కెప్టెన్‌గా నిలిచాడు. అతను తొలిసారిగా వైట్-బాల్ మ్యాచ్‌కు కూడా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. గిల్ కెప్టెన్సీలో, ఇంగ్లాండ్ పర్యటనలో టీం ఇండియా సిరీస్‌ను డ్రాగా ముగించింది. అతను ఇప్పుడు టీం ఇండియా భవిష్యత్తుగా పేరుగాంచాడు. గత సంవత్సరంలో బోర్డు ఒకరు లేదా ఇద్దరిని కాదు ఏకంగా ఆరుగురు కెప్టెన్లను భర్తీ చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

నాయకత్వంపై తర్జన భర్జనలు..

2024లో, రోహిత్ శర్మ టీమిండియా టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా, జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే, 2025లో, శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా, రిషబ్ పంత్ అధికారికంగా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. వన్డే క్రికెట్‌లో, గత సంవత్సరం రోహిత్ శర్మను కెప్టెన్‌గా, హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇప్పుడు, 2025లో, శుభ్‌మన్ గిల్ టీం ఇండియా వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉండనున్నాడు. శ్రేయాస్ అయ్యర్‌కు తొలిసారి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

టీ20 లో మార్పులు ఎలా జరిగాయంటే?

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో, రోహిత్ శర్మ మొదట కెప్టెన్‌గా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా అతని వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, రోహిత్ శర్మ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. శుభ్‌మాన్ గిల్ అతని వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

శుభ్‌మాన్ గిల్‌ను కెప్టెన్‌గా చేయడంపై అజిత్ అగార్కర్ ఏమన్నాడంటే?

శుభ్‌మన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమిస్తూ, మూడు వేర్వేరు ఫార్మాట్‌లకు ముగ్గురు కెప్టెన్లు తనకు అవసరం లేదని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. భవిష్యత్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో గిల్‌ను ఎంపిక చేశారు. 2027 వన్డే ప్రపంచ కప్‌లో గిల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఇప్పుడు స్పష్టమైంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us