IND vs BAN: టీమిండియా టెస్టు జట్టులో చోటు కోసం ముగ్గురి మధ్య భీకర యుద్ధం.. లక్కీ ఛాన్స్ ఎవరిదో?

India vs Bangladesh: బుచ్చి బాబు క్రికెట్ టోర్నమెంట్ 2024లో చాలా మంది కీలక ఆటగాళ్లు పాల్గొంటున్నారు. కాగా, మంగళవారం (ఆగస్టు 27) ముంబై, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటున్న ముగ్గురు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు.

IND vs BAN: టీమిండియా టెస్టు జట్టులో చోటు కోసం ముగ్గురి మధ్య భీకర యుద్ధం.. లక్కీ ఛాన్స్ ఎవరిదో?
Ind Vs Ban Test Series

Updated on: Aug 27, 2024 | 12:39 PM

India vs Bangladesh: బుచ్చి బాబు క్రికెట్ టోర్నమెంట్ 2024లో చాలా మంది కీలక ఆటగాళ్లు పాల్గొంటున్నారు. కాగా, మంగళవారం (ఆగస్టు 27) ముంబై, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటున్న ముగ్గురు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. ఇందుకోసం ముగ్గురు ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మరి వీరిలో ఎవరు బంగ్లాతో టెస్ట్ సిరీస్‌లో పాల్గొంటారో చూడాలి.

బుచ్చిబాబు టోర్నమెంట్‌కు ఎంపికైన ముంబై జట్టులో కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ కూడా చోటు సంపాదించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు భారత టెస్టు జట్టులో తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో సర్ఫరాజ్ ఖాన్, శ్రేయాస్ అయ్యర్‌లు బరిలోకి దిగుతుండగా, సూర్యకుమార్ యాదవ్ దృష్టి మరోసారి జట్టులో చోటు దక్కించుకోవడంపైనే ఉంది. ఈ ఏడాది జనవరి 25 నుంచి మార్చి 11 మధ్య ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ సిరీస్‌లో శ్రేయాస్ అన్ని మ్యాచ్‌లు ఆడలేదు. సర్ఫరాజ్ ఖాన్‌ను భర్తీ చేశాడు. అదే సమయంలో, సూర్యకుమార్ యాదవ్ జట్టులో భాగం కాదు.

సర్ఫరాజ్ ఖాన్ దారి ఎంత కష్టమో తెలుసా?

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన సఫ్రాజ్ ఖాన్ బంగ్లాదేశ్ సిరీస్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమే. ఆ సిరీస్‌లో ఆటగాళ్లు గైర్హాజరు కావడమే ఇందుకు కారణం. ఇటువంటి పరిస్థితిలో, సర్ఫరాజ్ ఖాన్ , సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్లలో ఒక బ్యాట్స్‌మెన్ మాత్రమే భారత టెస్ట్ జట్టులో ప్రవేశం పొందగలడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో, సర్ఫరాజ్ 3 మ్యాచ్‌ల 5 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేస్తూ 50 సగటుతో 200 పరుగులు చేశాడు.

సర్ఫరాజ్ ఖాన్‌కు గట్టి పోటీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్ 14 టెస్టు మ్యాచ్‌లు ఆడుతూ 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. ఈ ఇద్దరితో పోలిస్తే సూర్యకుమార్ యాదవ్‌కు టీమిండియా తరపున టెస్టు అనుభవం తక్కువగా ఉండటంతో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అయితే, సూర్యకుమార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బాగా రాణించాడు. 82 మ్యాచ్‌లు ఆడుతూ 43.62 సగటుతో 5628 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us