U19 World Cup 2024: సూపర్ సిక్స్ రౌండ్‌కు చేరిన 9 జట్లు.. భారత్, పాక్ పోరుకు రంగం సిద్ధం..

U19 World Cup 2024: జనవరి 30 నుంచి ప్రారంభమయ్యే సూపర్ 6 రౌండ్‌లో టీమ్ ఇండియాతో సహా 9 జట్లు తమ స్థానాన్ని నిర్ధారించుకున్నాయి. జనవరి 27 ఉదయం ఐసీసీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. గ్రూప్-ఎలో టీమ్ ఇండియాతో పాటు బంగ్లాదేశ్ మాత్రమే ఇప్పటివరకు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ గ్రూప్ నుంచి ఏ మూడో జట్టును ఎంపిక చేస్తారో చూడాలి.

U19 World Cup 2024: సూపర్ సిక్స్ రౌండ్‌కు చేరిన 9 జట్లు.. భారత్, పాక్ పోరుకు రంగం సిద్ధం..
U19 World Cup 2024

Updated on: Jan 27, 2024 | 4:35 PM

U19 World Cup 2024: దక్షిణాఫ్రికాలో జరిగే అండర్ 19 ప్రపంచ కప్ 2024 గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. జనవరి 30 నుంచి సూపర్ సిక్స్ దశ ప్రారంభం కానుంది. ఈ సూపర్ సిక్స్ (Super 6) దశలో 12 జట్లు ఆడనున్నాయి. ఈ దశలో ఇప్పటికే 9 జట్లు చోటు సంపాదించుకోగలిగాయి. మిగిలిన మూడు టీమ్‌లకు సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రపంచకప్‌లో 16 జట్లు పాల్గొంటున్నాయి. ఈ 16 జట్లను 4 జట్లు చొప్పున 4 గ్రూపులుగా ఉంచారు. ఒక్కో గ్రూప్ నుంచి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి.

9 జట్లు అర్హత..

జనవరి 30 నుంచి ప్రారంభమయ్యే సూపర్ 6 రౌండ్‌లో టీమ్ ఇండియాతో సహా 9 జట్లు తమ స్థానాన్ని నిర్ధారించుకున్నాయి. జనవరి 27 ఉదయం ఐసీసీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. గ్రూప్-ఎలో టీమ్ ఇండియాతో పాటు బంగ్లాదేశ్ మాత్రమే ఇప్పటివరకు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ గ్రూప్ నుంచి ఏ మూడో జట్టును ఎంపిక చేస్తారో చూడాలి. ఆ మూడో జట్టు స్థానం కోసం ఐర్లాండ్, అమెరికా పోటీ పడుతున్నాయి. ఇంగ్లండ్, వెస్టిండీస్ గ్రూప్ B నుంచి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాయి. ఇక గ్రూప్ సి నుంచి ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు చేరుకోగా.. గ్రూప్ డీ నుంచి పాకిస్తాన్, నేపాల్, న్యూజిలాండ్ చేరుకున్నాయి.

2 సమూహాలుగా..

పైన పేర్కొన్న విధంగా, మొత్తం 12 జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధించాయి. ఈ 12 జట్లను రెండు వేర్వేరు గ్రూపులుగా విభజించారు. ఇందులో గ్రూప్‌ ఎ, డి జట్లను మొదటి గ్రూప్‌లో, గ్రూప్‌ బి, సి జట్లను రెండో గ్రూప్‌లో ఉంచారు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా, పాకిస్థాన్ మధ్య సూపర్ సిక్స్ మ్యాచ్ జరగడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు. ఇది కాకుండా నేపాల్ జట్టు కూడా తొలిసారి సూపర్ సిక్స్‌కు అర్హత సాధించడం టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి.

అజేయంగా భారత్..

అండర్‌-19 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. టీం ఇండియా తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీని తర్వాత, రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టును 201 పరుగుల తేడాతో ఓడించి అజేయంగా తదుపరి రౌండ్‌లో స్థానం ఖాయం చేసుకుంది. అయితే, టీమ్ ఇండియా తన చివరి గ్రూప్ మ్యాచ్ ఆడలేదు. ఈ మ్యాచ్ రేపు అంటే జనవరి 28న అమెరికాతో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us