Garuda Puranam:మరణించే సమయంలో ఎదో చెప్పాలని ప్రయత్నించినా ఎందుకు చెప్పలేరో తెలుసా? గరుడ పురాణంలో ఏమి చెప్పారంటే..

|

Sep 22, 2021 | 8:21 PM

 జీవితం శాశ్వతం కాదని మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు మరణించాల్సిందే. అయినప్పటికీ, మానవుడు దీనికి తనని తాను సిద్ధం చేసుకోలేకపోతున్నాడు. మరణం పేరు చెబితేనే భయం వస్తుంది.

Garuda Puranam:మరణించే సమయంలో ఎదో చెప్పాలని ప్రయత్నించినా ఎందుకు చెప్పలేరో తెలుసా? గరుడ పురాణంలో ఏమి చెప్పారంటే..
Garuda Puranam
Follow us on

Garuda Puranam: జీవితం శాశ్వతం కాదని మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు మరణించాల్సిందే. అయినప్పటికీ, మానవుడు దీనికి తనని తాను సిద్ధం చేసుకోలేకపోతున్నాడు. మరణం పేరు చెబితేనే భయం వస్తుంది. జీవితంలో ప్రియమైనవారితో ఎన్ని ఫిర్యాదులు ఉన్నా, వారిని విడిచిపెట్టాలని అనిపించదు. మరణం సమీపిస్తున్నప్పుడు, ప్రియమైనవారితో అనుబంధం మరింత పెరుగుతుంది. ఎటువంటి పరిస్థితిలో, వ్యక్తి తన జీవితాన్ని వదులుకోవడానికి ఇష్టపడడు. అయితే..మరణానికి చేరువైనపుడు కచ్చితంగా తాను రియలైజ్ కావడం ప్రారంభం అవుతుంది. ఆ సమయంలో తానిక మరణాన్ని తప్పించుకోలేనని తెలుసుకుంటాడు. అప్పుడు తన ప్రియమైన వారితో మాట్లాడాలనీ, చాలా చెప్పాలనీ ప్రయత్నిస్తాడు. కానీ, అతను మాట్లాడలేడు. ఎంత ప్రయత్నించినా పెదవులు కదల్చడమే కష్టం అవుతుంది. కష్టపడి కదిల్చినా.. గొంతు దాటి మాటలు బయటకు రావు. ఈ పరిస్థితిలో అతనిని చూసిన వారు ఎదో చెప్పాలని అనుకుంటున్నాడు అని భావిస్తారు. తమలో తాము ఆ విషయాన్ని చెప్పుకుంటారు. కానీ, మరణశయ్య మీదనుంచి ఆ మనిషి ఏమి చెప్పాలని అనుకుంటున్నాడో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఈ పరిస్థితి గురించి గరుడ పురాణంలో వివరంగా చెప్పారు. అదేమిటో తెలుసుకుందాం.
అందుకే నాలుక మూసుకుంటుంది..

గరుడ పురాణం ప్రకారం, మరణ సమయం దగ్గర పడినప్పుడు, యముని ఇద్దరు దూతలు మరణిస్తున్న వ్యక్తి ముందు వచ్చి నిలబడతారు. వారిని చూసినప్పుడు, ఆ వ్యక్తి భయంకరంగా భయపడతాడు. అతను ఇకపై జీవించలేడని అతను గ్రహిస్తాడు. అటువంటి పరిస్థితిలో, అతను తన ప్రియమైనవారికి చాలా చెప్పలనుకుంటాడు కానీ, యమా భటులు పాశాన్ని విసిరి శరీరం నుండి జీవితాన్ని లాగడం ప్రారంభించినందున మాట్లాడలేకపోతాడు.

కళ్ల ముందు కర్మ వెళుతుంది

యమభటులు ఒక వ్యక్తి శరీరం నుండి జీవం లాక్కునే సమయంలో, ఆవ్యక్తికి జీవితంలోని సంఘటనలన్నీ వ్యక్తి కళ్ల ముందు ఒక్కొక్కటిగా వేగంగా గడిచిపోతాయని గరుడ పురాణంలో చెప్పారు. ఇది అతని కర్మగా మారుతుంది. దాని ఆధారంగా యమధర్మరాజు తన జీవితానికి న్యాయం చేస్తాడు. అందుకే ఒక వ్యక్తి జీవితంలో మంచి పనులు మాత్రమే చేయాలని చెబుతారు. తద్వారా మరణ సమయంలో, అతను అదే పనులను తనతో తీసుకువెళతాడు.

అనుబంధం లేని వ్యక్తి పెద్దగా బాధపడడు

భగవంతుడు శ్రీ కృష్ణుడు కూడా ఒక వ్యక్తి తన పని తాను చేసుకోవాలని మరియు అటాచ్‌మెంట్‌లో చిక్కుకోకూడదని చెప్పాడు. కానీ భూమిపైకి వచ్చిన తరువాత, చాలా మంది ప్రజలు భ్రమలో చిక్కుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఈ బంధం నుండి బయటపడితే, అతను తన జీవితాన్ని త్యాగం చేసేటప్పుడు పెద్దగా బాధపడడు. కానీ మరణ సమయంలో కూడా అనుబంధాన్ని వదులుకోలేని వారు, వారి జీవితాన్ని యమదూతలు బలవంతంగా తీసుకుని వెళ్తారు. అలాంటి వ్యక్తి తన జీవితాన్ని వదులుకునేటప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది.

Also Read: Garuda Puranam: ఆత్మహత్య చేసుకున్నవారికి ఏం జరుగుతుంది? గరుడ పురాణం ఏం చెబుతోంది?

Garuda Puranam: ఈ ఐదు అలవాట్లను వెంటనే వదిలిపెట్టండి.. లేదంటే మీ ఆయుష్షు తగ్గినట్లే.!