ఎస్పీ బాలు కోసం శబరిమలలో ప్ర‌త్యేక పూజ‌లు, సంగీత సమర్పణ

కరోనా సోకి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోన్న‌ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడి,  కోలుకోవాల‌ని కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్ర‌త్యేక‌ పూజలు నిర్వహించారు.

ఎస్పీ బాలు కోసం శబరిమలలో ప్ర‌త్యేక పూజ‌లు, సంగీత సమర్పణ
Follow us

|

Updated on: Aug 21, 2020 | 8:36 PM

కరోనా సోకి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోన్న‌ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడి,  కోలుకోవాల‌ని కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్ర‌త్యేక‌ పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించే ‘ఉషా పూజ’ను బాలు పేరిట చేసినట్లు ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.

“త‌బ‌లా, నాదస్వరం వంటి వాయిద్యాలతో అయ్య‌ప్ప స్వామి ముందు సంగీత సమర్పణ చేశాం. ఎస్సీబీ ఆలపించిన ‘శంకరా.. నాద సరీరా’ పాటను దేవస్థాన వాయిద్యకారులు స్వామి వారికి వినిపించారు” అని ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ప్ర‌స్తుతం బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రి వైద్యులు అత్య‌వ‌స‌ర చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆయనను వెంటిలేటర్​పై ఉంచి.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్​లో ఎక్మో సాయంతో ట్రీట్మెంట్ ద్వారా అందిస్తున్నారు.

Also Read :

మెగాస్టార్ బర్త్​డే మోషన్ పోస్టర్ అదిరిపోయింది..ఇదిగో

సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంకను విచారించిన ఈడీ