హీరోతో బోల్డ్ సీన్స్ పై.. మనీషా కోయిరాల షాకింగ్ కామెంట్స్.

08 May 2024

Anil Kumar

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి - ది డైమండ్ బజార్’.

బ్రిటిష్ హయాంలో హీరామండి అనే రెడ్ లైట్ ఏరియా బ్రతుకున్తున్నా డ్యాన్సర్ల జీవితాల గురించి ఈ సిరీస్‌ ఉంటుంది.

మనీష కొయిరాలా, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసినదే.

ఈ సిరీస్‌ తో ప్రశంసలు అందుకున్న నటి 'మనీషా కోయిరాల'.. తాను నటించిన బోల్డ్ సీన్‌పై తాజాగా స్పందించారు.

నేను చేసే క్యారెక్టర్ గురించి, రొమాంటిక్ అండ్ బోల్డ్ సీన్స్ గురించి డైరెక్టర్ సంజయ్ నాకు ముందే చెప్పాడు.

సంజయ్ ఒక మేకర్.. తను ఏం చేయాలి, ఎలాంటి సీన్ రాయాలి.. ఎలా తెరకెక్కించాలి అని ముందే డిసైడ్ అయ్యి ఉంటుంది..

దాన్ని మనం తెరమీద చూపించడంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు.. మన ప్రొఫెషన్ లో ఇలాంటి సీన్స్ చెయ్యడం కామన్..

ఏ సీనైనా బాగా రావడానికి సంజయ్ ముందు రిహార్సల్స్ చేయిస్తాడు. నేను చేసిన రొమాంటిక్ సీన్స్ రిహార్సల్స్ చేసి టేక్ కి వెళ్లాం.

ఏ ఏజ్ లో అయినా ఒక ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పేమీ కాదు. దానికి నేనేమీ ఇబ్బంది పడలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.