Major Movie : కీలక పాత్ర కోసం సయీ మంజ్రేకర్
అడవి శేష్..ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. నటుడిగా, రచయితగా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు ఇతగాడు.
అడవి శేష్..ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. నటుడిగా, రచయితగా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు ఇతగాడు. తాజాగా 26/11 ముంబై దాడుల ఆధారంగా తీస్తున్న ‘మేజర్’లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ను సోషల్ మీడియా ద్వారా తెలిపాడు శేష్. ఇందులో సయీ మంజ్రేకర్ కీలకపాత్ర కోసం ఎంపిక చేసినట్లు ప్రకటించాడు. అక్టోబరు నుంచి ఆమె షూటింగ్ లో పాల్గొననుందని చెప్పాడు.
ఎన్ఎస్జీ కమాండర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవత చరిత్ర నేపథ్యంలో ’మేజర్’ తెరకెక్కుతోంది. 26/11 దాడుల సమయంలో తాజ్ హోటల్లో చిక్కుకున్న 14 మందిని రక్షించే క్రమంలో సందీప్ ఉన్నికృష్ణన్ ప్రాణాలను కోల్పోయారు. ఈ ప్రాజెక్టును సూపర్స్టార్ మహేశ్బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Also Read :
ఐపీఎల్ కామెంట్రీ కోసం ముంబై వచ్చి, గుండెపోటుతో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మృతి