ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి తేజ్..!
వరస ప్లాపుల తర్వాత ఇటీవలే సుప్రీం స్టార్ సాయి తేజ్ ట్రాక్ లోకి వచ్చారు. వరసగా “చిత్ర లహరి “, ప్రతి రోజూ పండగే ” వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు.
వరస ప్లాపుల తర్వాత ఇటీవలే సుప్రీం స్టార్ సాయి తేజ్ ట్రాక్ లోకి వచ్చారు. వరసగా “చిత్ర లహరి “, ప్రతి రోజూ పండగే ” వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో సుబ్బు దర్శకత్వంలో “సోలో బ్రతుకే సో బెటర్ ” సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి కూడా చాలా పాజిటివ్ బజ్ ఉంది. ఈ చిత్రం కంప్లీట్ చేసిన తర్వాత తరువాత సెన్సుబుల్ డైరెక్టర్ దేవా కట్టా దర్శకత్వంలో ఒక మూవీకి సాయి తేజ్ సైన్ చేశారు.
జెబి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవ్వనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం కూడా అయ్యింది. నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కాగా సీనియర్ నటి రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా అందుతోన్న రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీలో సాయి తేజ్ ఫవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారట. అందుకోసం సాయి తేజ్ ఇప్పటికే ప్రిపరేషన్ కూడా ప్రారంభించారని సమాచారం. పలువురు ఐఏఎస్ ఆఫీసర్స్ వీడియోస్ చూస్తూ తన పాత్ర కోసం సన్నద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.