హిట్మ్యాన్ ‘వెయ్యి’ కొట్టేశాడు!
ఎడ్జ్బాస్టన్: భారత్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఏడాదిలో వెయ్యి పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచకప్లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. మ్యాచ్కు ముందు వెయ్యికి 4 పరుగులు దూరంలో ఉన్న హిట్మ్యాన్.. మోర్తజా బౌలింగ్లో సిక్స్ కొట్టి ఆ మార్కును అందుకున్నాడు. దీంతో క్యాలెండర్ ఇయర్లో ఫించ్, ఖవాజా తర్వాత స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. కాగా బంగ్లాదేశ్తో […]
ఎడ్జ్బాస్టన్: భారత్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఏడాదిలో వెయ్యి పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచకప్లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. మ్యాచ్కు ముందు వెయ్యికి 4 పరుగులు దూరంలో ఉన్న హిట్మ్యాన్.. మోర్తజా బౌలింగ్లో సిక్స్ కొట్టి ఆ మార్కును అందుకున్నాడు. దీంతో క్యాలెండర్ ఇయర్లో ఫించ్, ఖవాజా తర్వాత స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. కాగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 28 పరుగులు తేడాతో విజయం సాధించి సెమీస్లోకి అడుగుపెట్టింది.