ధోనీకి సవాల్ విసిరిన పంత్

న్యూఢిల్లీ: భారత జట్టు మాజీకెప్టెన్, మిస్టర్ కూల్ ధోనీకి టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ సవాల్ విసిరాడు. “మహీ భాయ్ రెడీగా ఉండు.. గేమ్‌లో తేల్చుకుందాం” అంటూ కామెంట్ చేశాడు. ఐపిఎల్‌లో మహీతో అమీతుమీకి సిద్ధంగా ఉన్నానని, తన బ్యాటింగ్ చూసి ధోనీ కూల్‌గా ఉండలేకపోవచ్చని కవ్వించాడు. ఐపీఎల్ నేపథ్యంలో ప్రసారకర్తలు విడుదల చేసిన ఓ ప్రమోషనల్ వీడియోలో పంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. హిందీలో మాట్లాడిన పంత్ ధోనీని రెచ్చగొట్టే విధంగా చేసిన ఈ […]

ధోనీకి సవాల్ విసిరిన పంత్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 8:04 PM

న్యూఢిల్లీ: భారత జట్టు మాజీకెప్టెన్, మిస్టర్ కూల్ ధోనీకి టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ సవాల్ విసిరాడు. “మహీ భాయ్ రెడీగా ఉండు.. గేమ్‌లో తేల్చుకుందాం” అంటూ కామెంట్ చేశాడు. ఐపిఎల్‌లో మహీతో అమీతుమీకి సిద్ధంగా ఉన్నానని, తన బ్యాటింగ్ చూసి ధోనీ కూల్‌గా ఉండలేకపోవచ్చని కవ్వించాడు. ఐపీఎల్ నేపథ్యంలో ప్రసారకర్తలు విడుదల చేసిన ఓ ప్రమోషనల్ వీడియోలో పంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. హిందీలో మాట్లాడిన పంత్ ధోనీని రెచ్చగొట్టే విధంగా చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఐపిఎల్‌లో జోష్ పెంచేందుకు మాత్రమే తయారు చేసిన ఈ వీడియోలో పంత్ ధోనీ తన గురువు అని చెప్పాడు. ధోనీ భాయ్ లేకపోతే తాను వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయ్యేవాడ్నో కాదో అని అన్నాడు. పంత్ వ్యాఖ్యల తర్వాత వీడియో చివర్లో కనిపించిన ధోనీ ఎప్పటిలాగే ఓ కూల్ లుక్ ఇచ్చాడు.