అఖిల్‌కి జోడిగా కన్నడ కస్తూరి.?

అక్కినేని అఖిల్ హీరోగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. ఒక్క హీరోయిన్ తప్ప.. మిగిలిన నటీనటులందరినీ చిత్ర యూనిట్ ఎంపిక చేసింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం.. ఆ మధ్య ఇద్దరు కొత్త హీరోయిన్స్‌ను చూసారని.. వాళ్ళల్లో ఒకరిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారని వార్తలు కూడా వచ్చాయి. అయితే చివరికి అవి రూమర్స్ అని తేలిపోయాయి. కాగా […]

అఖిల్‌కి జోడిగా కన్నడ కస్తూరి.?
Follow us

|

Updated on: Jul 02, 2019 | 3:42 AM

అక్కినేని అఖిల్ హీరోగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. ఒక్క హీరోయిన్ తప్ప.. మిగిలిన నటీనటులందరినీ చిత్ర యూనిట్ ఎంపిక చేసింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం.. ఆ మధ్య ఇద్దరు కొత్త హీరోయిన్స్‌ను చూసారని.. వాళ్ళల్లో ఒకరిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారని వార్తలు కూడా వచ్చాయి. అయితే చివరికి అవి రూమర్స్ అని తేలిపోయాయి.

కాగా తాజా సమాచారం ప్రకారం అఖిల్ సరసన కన్నడ కస్తూరి రష్మిక మందన్నాను హీరోయిన్‌గా ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అఖిల్‌కి ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ సినిమాపై మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.