జగన్‌ను ప్రజలు అందుకే గెలిపించారు : చంద్రబాబు

| Edited By: Srinu

May 29, 2019 | 6:02 PM

జగన్‌పై ఉన్న సానుభూతే వైసీపీని గెలిపించిందని అన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పనిచేశామన్నారు. బుధవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీపై ప్రజలకు కోపం లేదని జగన్‌పై ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించదని అన్నారు. ఓటమి చెందినందుకు ఎవరూ బాధపడొద్దని, మనం ఇంకొంచెం కష్టపడదామని అన్నారు. ఏదేమైనా కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో కొంత కాలం వేచి చూద్దామని, తొందరపడి విమర్శలకు దిగొద్దని నేతలకు చంద్రబాబు సూచించారు.

జగన్‌ను ప్రజలు అందుకే గెలిపించారు : చంద్రబాబు
Follow us on

జగన్‌పై ఉన్న సానుభూతే వైసీపీని గెలిపించిందని అన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పనిచేశామన్నారు. బుధవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీపై ప్రజలకు కోపం లేదని జగన్‌పై ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించదని అన్నారు. ఓటమి చెందినందుకు ఎవరూ బాధపడొద్దని, మనం ఇంకొంచెం కష్టపడదామని అన్నారు. ఏదేమైనా కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో కొంత కాలం వేచి చూద్దామని, తొందరపడి విమర్శలకు దిగొద్దని నేతలకు చంద్రబాబు సూచించారు.