పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు

| Edited By: Srinu

Mar 09, 2019 | 6:01 PM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. సన్నాహక సభలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూసుకెళ్తున్నారు. గులాబీ కేడర్‌కు దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్, వరంగల్లో కేటీఆర్ సభలు నిర్వహించారు. నేడు మెదక్, మల్కాజ్ గిరి పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నిర్వహించే టీఆర్ఎస్ సన్నాహక సభల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ గ్రౌండ్ వేదికగా సన్నాహక సభకు గులాబీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ సభకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల […]

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు
Follow us on

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. సన్నాహక సభలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూసుకెళ్తున్నారు. గులాబీ కేడర్‌కు దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్, వరంగల్లో కేటీఆర్ సభలు నిర్వహించారు. నేడు మెదక్, మల్కాజ్ గిరి పార్లమెంటరీ నియోజకవర్గాల్లో నిర్వహించే టీఆర్ఎస్ సన్నాహక సభల్లో కేటీఆర్ పాల్గొననున్నారు.

మెదక్ జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ గ్రౌండ్ వేదికగా సన్నాహక సభకు గులాబీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ సభకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుచి 25 వేల మంది ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డితో పాటు ఇతర నేతలు సభా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.

16 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మెదక్‌కు తొలిసారి రానుండడంతో టీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు చిన్న శంకరం పేట అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్ నివాళులర్పించున్నారు. అనంతరం బైక్ ర్యాలీగా మెదక్ చేరకోనున్నారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీపులో మెదక్ ప్రధాన రహదారి నుంచి మున్సిపల్ కార్యాలయం, రాందాస్ చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా సభాస్థలికి చేరుకుంటారు. మెదక్ సభ పూర్తి కాగానే మల్కాజ్ గిరిలో జరిగే సన్నహాక సభకు కేటీఆర్ బయలుదేరుతారు.