కేఏ పాల్ నామినేషన్ ను ఓకే చేసిన అధికారులు

నరసాపురం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఓకే చేశారు. ఇది ఇలా ఉంటే తమ నామినేషన్ ను తిరస్కరించేలా వైసీపీ నేత విజయసాయి రెడ్డి కుట్ర పన్నారని కేఏ పాల్ ఆరోపించారు. అంతేకాదు ఆయన మాట్లాడుతూ ‘జగన్ కు ఓటేస్తే అవినీతిని సమర్ధించినట్లేనని.. పవన్ కు ఓటేస్తే గ్లాసు పగిలిపోయినట్లేనని’ పాల్ వ్యాఖ్యానించారు. అసలు పవన్ కు […]

కేఏ పాల్ నామినేషన్ ను ఓకే చేసిన అధికారులు

Updated on: Mar 26, 2019 | 4:39 PM

నరసాపురం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్ నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఓకే చేశారు. ఇది ఇలా ఉంటే తమ నామినేషన్ ను తిరస్కరించేలా వైసీపీ నేత విజయసాయి రెడ్డి కుట్ర పన్నారని కేఏ పాల్ ఆరోపించారు.

అంతేకాదు ఆయన మాట్లాడుతూ ‘జగన్ కు ఓటేస్తే అవినీతిని సమర్ధించినట్లేనని.. పవన్ కు ఓటేస్తే గ్లాసు పగిలిపోయినట్లేనని’ పాల్ వ్యాఖ్యానించారు. అసలు పవన్ కు ప్రజాసేవ చేసే ఉద్దేశ్యమే లేదని వ్యంగ్యంగా అన్నారు. కాగా తనని గెలిపిస్తే ఏడాదిలో నరసాపురం నియోజకవర్గాన్ని అమెరికాలా అభివృద్ధి చేస్తానని పాల్ హామీ ఇచ్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us