తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూసుకెళ్తున్న కమలదళం

తెలంగాణ దంగల్‌పై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. అత్యధిక ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అగ్రనేతలు. ఒకరెనక ఒకరు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సౌత్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ. ఈసారి ఎలాగైనా అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతోంది. అందులోభాగంగానే తెలంగాణకు క్యూ కడుతున్నారు జాతీయ నేతలు. భారీ బహిరంగ సభలు, రోడ్‌ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణలో ప్రచారాన్ని నిర్వహించారు.

తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూసుకెళ్తున్న కమలదళం
Telangana Bjp
Follow us

|

Updated on: May 06, 2024 | 9:52 AM

తెలంగాణ దంగల్‌పై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. అత్యధిక ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అగ్రనేతలు. ఒకరెనక ఒకరు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సౌత్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ. ఈసారి ఎలాగైనా అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతోంది. అందులోభాగంగానే తెలంగాణకు క్యూ కడుతున్నారు జాతీయ నేతలు. భారీ బహిరంగ సభలు, రోడ్‌ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణలో ప్రచారాన్ని నిర్వహించారు. కాగజ్‌నగర్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఇక ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ సీఎంలతో పాటు తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు.

ఇవాళ పెద్దపల్లిలో పర్యటించనున్నారు జేపీ నడ్డా. 10 గంటలకు భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు చౌటప్పల్‌ సభకు హాజరై ప్రసంగిస్తారు. అక్కడ్నుంచి నేరుగా నల్గొండ వెళ్లి.. మూడు గంటలకు జరబోయే బహిరంగ సభలో పాల్గొంటారు నడ్డా. అలాగే ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ కూడా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. 10 గంటలకు ముషీరాబాద్‌లోని యువసమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మహబూబాబాద్‌ పరిధిలోని నర్సంపేటలో బీజేపీ నిర్వహించే సభకు ఆయన హాజరై ప్రసంగిస్తారు. మరోవైపు రాజస్థాన్‌ సీఎం భజన్‌ లాల్‌ శర్మ సైతం తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లోని ప్రవాసి సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు.

ఇక తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఇవాళ తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌ పరిధిలోని జమ్మికుంటలో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడ్నుంచి నాగర్‌ కర్నూలు జిల్లా కల్వకుర్తికి వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే సభలో పాల్గొని ప్రసంగిస్తారు అన్నామలై. ఇక సాయంత్రం సికింద్రాబాద్‌లో పరిధిలోని సనత్‌నగర్‌లో ప్రచారం నిర్వహిస్తారు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి బైక్‌ ర్యాలీలో పాల్గొంటారు అన్నామలై. మొత్తంగా.. అత్యధిక పార్లమెంట్‌ స్థానాలే లక్ష్యంగా తెలంగాణలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
బెంగళూరుతో ప్లే ఆఫ్స్‌లో తలపడే జట్టు ఏదో తెలుసా?
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు.. 9 మంది సజీవ దహనం
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..