విపణిలోకి ఇటలీకి చెందిన ఎలక్ట్రిక్‌ ఆటో..

ఇటలీకి చెందిన ఆటో దిగ్గజం పియాజియో మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ 3 వీలర్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఆపే ఈ-సిటీ పేరుతో తెచ్చిన ఈ త్రీ వీలర్ ఆటో ధరను రూ.1.97 లక్షలుగా నిర్ణయించింది. దీనికి మార్చుకునే వీలుండే లిథియం ఐయాన్ బ్యాటరీతో ఈ ఆటో వస్తుంది. ఇక బ్యాటరీ, ఛార్జింగ్‌ సదుపాయాల కోసం.. సన్‌ మొబిలిటీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ పియాజియో సంస్థకు ఎలక్ట్రిక్ టెక్నాలజీను అభివృద్ది చేయడంలో పదిహేనేళ్ల అనుభవం ఉందని.. దీని ద్వారానే […]

విపణిలోకి ఇటలీకి చెందిన ఎలక్ట్రిక్‌ ఆటో..
Follow us

| Edited By:

Updated on: Dec 20, 2019 | 12:54 AM

ఇటలీకి చెందిన ఆటో దిగ్గజం పియాజియో మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ 3 వీలర్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఆపే ఈ-సిటీ పేరుతో తెచ్చిన ఈ త్రీ వీలర్ ఆటో ధరను రూ.1.97 లక్షలుగా నిర్ణయించింది. దీనికి మార్చుకునే వీలుండే లిథియం ఐయాన్ బ్యాటరీతో ఈ ఆటో వస్తుంది. ఇక బ్యాటరీ, ఛార్జింగ్‌ సదుపాయాల కోసం.. సన్‌ మొబిలిటీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంది.

ఈ పియాజియో సంస్థకు ఎలక్ట్రిక్ టెక్నాలజీను అభివృద్ది చేయడంలో పదిహేనేళ్ల అనుభవం ఉందని.. దీని ద్వారానే ఇండియన్ మార్కెట్‌లోకి ఉత్పత్తులు తీసుకొచ్చామని.. ఆ సంస్థ ఎండీ, సీఈవో డియాగో గ్రఫీ తెలిపారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా.. బ్యాటరీలను అభివృద్ధి చేశామని.. మార్చుకునే అవకాశం ఉండే బ్యాటరీతో పాటుగా.. ఫిక్స్‌డ్ బ్యాటరీ టెక్నాలజీ కూడా డెవలప్ చేశామన్నారు. వచ్చే సంవత్సరం రెండో క్వార్టర్లీ నాటికి.. ఫిక్స్‌డ్‌ బ్యాటరీ త్రీ వీలర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని.. ప్యాసెంజర్‌, గూడ్స్‌ క్యారేజ్‌ విభాగంలో కూడా.. ఎలక్ట్రిక్‌ వెర్షన్లను అందుబాటులోకి తెస్తామన్నారు.

సన్‌ మొబిలిటీతో కలిసి.. మొదటి విడతలో భాగంగా చండీగఢ్‌, మొహాలీ, గురుగ్రామ్‌ నగరాల్లో.. ఈ అపే ఈ-సిటీని విడుదల చేయబోతున్నారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి.. దాదాపు 10 నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ చేసేందుకు వీలుకల్పించే స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.