
చైనా రైల్వే వ్యవస్థ చాలా గొప్పది. 19 అంతస్తుల భవనం మధ్యలో నుంచి వెళ్లే రైలును చైనా తయారు చేసింది. ఈ ప్రత్యేక రైల్వే స్టేషన్, నెట్వర్క్కు సంబంధించిన ఫోటోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు దాని కథనాలు కూడా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి షోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చక్కర్లు కొడుతుంటాయి. ఈ వింత రైలు, రైల్వే స్టేషన్ను ఫోటోలు తీయడానికి దేశం, ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడకు వస్తారు.

ఈ చైనీస్ టెక్నాలజీ గురించి చెప్పాలంటే, ఈ రైలు ఇతర రైళ్లలాగా పెద్దగా చెవులు పగిలిపోయే శబ్దం చేయదు. ఇది చాలా బ్యాలెన్స్డ్ టోన్లో సెట్ చేయబడింది. అధిక వేగం ఉన్నప్పటికీ, 60 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం చేయకుండా ప్రయత్నిస్తుంది.

భవనం గుండా ట్రాక్ను ఏర్పాటు చేయటం చాలా కష్టం. కానీ చైనీస్ ఇంజనీర్లు దీన్ని చేసారు. అందుకే చైనా ప్రజలే కాకుండా ఇతర దేశాల ప్రజలు కూడా తరచుగా ఈ ఫ్లాట్ల ధర గురించి కూడా చర్చించుకుంటూ ఉంటారు.

ఇకపోతే, ఆ భవనంలో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగని విధంగా ఈ ట్రాక్ను ఏర్పాటు చేశారు. భవనంలోని వ్యక్తులకు కూడా ప్లస్ పాయింట్ ఉంది. వారికంటూ సొంతంగా ప్రత్యేక రైల్వే స్టేషన్ను కలిగి ఉన్నారు. ఇక్కడ ప్రజలు తమ ఇంట్లోంచే నేరుగా రైలు ఎక్కుతున్నారు. రైలు శబ్దం విషయానికొస్తే, చైనా సైలెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించింది. దీని కారణంగా శబ్దం చెవులకు చేరదు.

ఈ టెక్నాలజీ యుగంలో చైనా అమెరికాతో శరవేగంగా పోటీ పడుతోంది. నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక విషయాల్లో యూరోపియన్ దేశాల కంటే ముందుంది. చైనా కృత్రిమ సూర్యుడిని సృష్టించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో చైనాకు చెందిన ఈ రైలు నెట్వర్క్ ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది.