
వేసవిలో ఎండలు ఎంతలా మండుతున్నాయో దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండు నిమిషాలు అలా ఇంటి నుంచి మళ్ళీ వస్తే బాడీ మొత్తం హీటేక్కిపోతుంది. ఇక ఇలాంటి టైంలో మన పెద్దలు తాగిన బియ్యం జావ ఇలా చేసుకుంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఈ సాంప్రదాయ డ్రింక్ చల్లదనాన్ని ఇస్తుంది ఇంకా రోజంతా శక్తిని ఇస్తుంది. ఇది వరకు రైతులు, కూలీలు ఈ జావను ఉదయాన్నే తాగి పొలాలకు వెళ్ళి తమ పనులను చేసుకునే వాళ్ళు.

బియ్యం జావకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు బియ్యం, 5 నుంచి 6 కప్పులు నీళ్ళు తీసుకోవాలి, అలాగే ఒక కప్పు మజ్జిగ లేదా పెరుగును తీసుకోవాలి. ఇంకా రుచికి సరిపడా ఉప్పు, రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా కరివేపాకు, అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి. మంట ఉన్న పచ్చి మిర్చి అయితే చాలా తక్కువే తీసుకోండి.

బియ్యం జావకు తయారి విధానం : ముందుగా మీరు బియ్యాన్ని తీసుకుని వాటిని బాగా శుభ్రంగా చేసి కుక్కర్లో వేసుకుని ఇంకో గిన్నెలో కొద్దిగా నీటితో దీనిని మెత్తగా ఉడికించాలి. బియ్యం మొత్తం మెత్తబడ్డాక దీనిలో ఉన్న గంజిని వేరు తీసుకుని ఒక పాత్రలో పోసుకోవాలి. ఈ గంజే బియ్యం జావలో చాలా ముఖ్యం. దీనిని కొద్దీ సేపు పక్కన పెట్టుకోవాలి.

కొద్దీ సేపటి తర్వాత గంజిని తీసుకుని పూర్తిగా చల్లారినిచ్చిన తర్వాత దానిలో మజ్జిగ లేదా పెరుగును కలుపుకుంటే చాలు. ఇంకా కొద్దీ సేపటి తర్వాత దీనిలో ఉప్పు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చివర్లో కొత్తిమీర, నాలుగు కరివేపాకు ఆకులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

ఇంకా విలేజ్ టేస్ట్ రావాలంటే దీనిని మట్టికుండ పెట్టి కాసేపు అలా ఉంచండి. ఇలా చేస్తే చల్లదనం వస్తుంది. అలాగే , ఇంకొందరు రాత్రి మిగిలిన చద్దన్నంలో నీరు పోసి ఉదయం వాటితోనే జావ తయారు చేస్తారు. పాత రోజుల్లో నీళ్ళన్నం అని అనే వాళ్ళు. ఇది తాగితే బాడిలో హీట్ మొత్తం ఇట్టే తగ్గిపోతోంది. ఇంకా డీ హైడ్రేషన్ సమస్యలు కూడా తగ్గుతాయి. మీరు కూడా ఇంట్లో దీనిని తయారు చేసుకుని తాగండి.