
ఇది వరకు పాత రోజుల్లో ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు పెద్దలు నుంచి రైతులు, కూలీలు తప్పకుండా దీనినే తాగే వాళ్ళు. ఈ చల్లని పానీయమే సగ్గుబియ్యం జావ ఒకటి. ఇది ఒక్కసారి తాగితే అస్సలు వదలరు అంత రుచిగా ఉంటుంది ఇంకా ఇది శరీరానికి కూడా చల్లదనం ఇస్తుంది. ఆలాగే శక్తిని కూడా వెంటనే ఇస్తుంది. అలా సంప్రదాయ డ్రింక్గా కూడా పిలుస్తారు. పల్లెటూర్లలో ఇప్పటికీ ఈ జావను సమ్మర్లో ఎక్కువగా తయారు చేస్తారు.

సగ్గుబియ్యం తయారీ విధానం : సగ్గుబియ్యాన్ని నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత వీటిని బాగా ఉడికించి చల్లార్చాలి. కొద్దీ సేపటి తర్వాత దీనిలో పాలు లేదా మజ్జిగ కలుపుకోవాలి. ఇంకా దీనిలో మీరు బెల్లం లేదా కొద్దిగా ఉప్పు వేసుకుని మీ రుచికి ఎలా తాగితే అలా తయారు చేసుకోవచ్చు. మీరు దీనిలో చల్లగా తాగితే ఒంటిలో ఉన్న వేడి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

సగ్గుబియ్యం వలన కలిగే లాభాలు ఇవే.. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే ఎండలో తిరిగిన తర్వాత అలసటను కూడా ఇది తగ్గిస్తుంది. ఇంకా నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలను కూడా ఇది తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇంకా ఇది కడుపుకు తేలికగా ఉండి జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరస్తుంది

ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అలాగే చిన్న పిల్లలు నుంచి వయస్సు అయిపోయిన , వృద్ధులు కూడా తాగొచ్చు. అంతే కాదు, దీనిని తాగితే వేసవిలో అందర్ని ఇబ్బంది పెట్టె బాడీ హీట్ ను తగ్గిస్తుంది. అలాగే దీనిని ఒకసారి తాగితే మళ్ళీ ఆకలి కూడా వేయదు ఎందుకంటే, కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అంతేకాదు, మజ్జిగ లేదా పాలు కలిపి తీసుకుంటే ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. పాతకాలంలో ఇది సహజ కూలింగ్ డ్రింక్గా తాగే వాళ్ళు.

ఇది కొంచం తియ్యగా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్నవారు కచ్చితంగా వైద్యున్ని సంప్రదించి దీనిని తాగాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)