
టోక్యో ఒలింపిక్ క్రీడలలో డెన్మార్క్కు చెందిన విక్టర్ ఆక్సెల్సన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో బంగారు పతకం సాధించాడు. అతను డిఫెండింగ్ ఛాంపియన్ చైనాకు చెందిన చెన్ లాంగ్ను 21-15, 21-12 వరుస గేమ్లలో ఓడించి తొలిసారిగా ఒలింపిక్ ఛాంపియన్ అయ్యాడు. 1996 తర్వాత పురుషుల సింగిల్స్లో స్వర్ణం గెలిచిన మొదటి ఆసియేతర ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్లో, డెన్మార్క్కి చెందిన పాల్ ఎరిక్ హౌర్ లార్సెన్ స్వర్ణం సాధించాడు. ఆసియా ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించిన ఈ గేమ్లో విక్టర్ ఆక్సెల్సన్ విజయం సాధించడం గమనార్హం. అతను ప్రస్తుతం జపాన్కు చెందిన కెంటో మొమోటా కంటే ప్రపంచ ర్యాంకింగ్లో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఒలింపిక్ స్వర్ణం గెలిచిన తరువాత, విక్టర్ ఆక్సెల్సన్ భావోద్వేగంతో ఏడ్చాడు.

విక్టర్ ఆక్సెల్సన్ విజయం సాధించిన కొద్దిసేపటికే, అతనికి డెన్మార్క్ యువరాజు ఫ్రెడరిక్ నుండి కాల్ వచ్చింది. ఈమేరకు విజయం సాధించిన విక్టర్ను అభింనందిచాడు. ఇక్కడికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డానని ఈ సందర్భంగా విక్టర్ తెలిపాడు. టోక్యో ఒలింపిక్ క్రీడల్లో ఆక్సెల్సన్ ఒక్క గేమ్ కూడా ఓడిపోలేదు. ఐదేళ్ల క్రితం రియోఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించాడు. ఆక్సెల్సన్ చేతిలో ఓడిపోయిన చెన్ లాంగ్ ప్రపంచ ర్యాంకింగ్స్లో ఆరో స్థానంలో ఉన్నాడు. సెమీ ఫైనల్స్లో చెన్ లాంగ్ ఆక్సెల్సన్ని ఓడించాడు.

మ్యాచ్ తర్వాత, ఆక్సెల్సన్ తన జెర్సీని చెన్ లాంగ్తో మార్చుకున్నాడు. క్రీడలలో ప్రత్యర్థికి గౌరవం చూపించేందుకు ఇలా చేస్తారు. తాజా ఓటమితో చైనా ఆటగాడు లిన్ డెన్.. రెండు వరుస ఒలింపిక్ పతకాలను గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాడు. లిన్ డెన్ చైనాకు చెందిన ప్లేయర్. చెన్ లాంగ్ వయస్సు 32 సంవత్సరాలు. అయితే పోటీల ప్రారంభానికి ముందు, చాలా కొద్ది మంది మాత్రమే అతడు పతక పోటీదారుడిగా భావించారు.

టోక్యో ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్ కాంస్య పతకాన్ని ఇండోనేషియాకు చెందిన ఆంథోనీ సినీసుక జింటింగ్ గెలుచుకున్నాడు. అతను 59 వ ర్యాంక్ గ్వాటెమాలన్ ఆటగాడు కెవిన్ కార్డెన్ను 21-11, 21-13పై గెలిచాడు. కెవిన్ కార్డెన్ ఒలింపిక్ క్రీడలలో సెమీ ఫైనల్కు చేరుకున్న మొదటి ఆసియేతర, యూరోపియనేతర ఆటగాడు.

మహిళల సింగిల్స్లో బంగారు పతకాన్ని చైనాకు చెందిన యు ఫే గెలుచుకుంది. ఆమె చైనీస్ తైపీకి చెందిన తాయ్ జు యింగ్ను ఓడించింది. కాంస్య పతకం భారతదేశానికి చెందిన పీవీ సింధుకు దక్కింది. మరోవైపు, ఇండోనేషియా మహిళల డబుల్స్ జంట గ్రేసియా పోలి - అపారియానీ రహాయు 21-19, 21-15 వరుస గేమ్లలో చైనా జంట చెన్ క్వింగ్ చెన్ - జియా యి ఫ్యాన్ను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల డబుల్స్లో, చైనా జంటలు వరుసగా ఐదు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్నాయి.