భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా.. డేంజర్లో పడ్డట్లే!

Updated on: Jul 21, 2025 | 5:10 PM

చాలా మంది తిన్న తర్వాత పడుకోవడం, లేదా వేగంగా నడవడం వంటి కొన్ని పనులు చేస్తుంటారు. అయితే తిన్న తర్వాత అస్సలే కొన్ని పనులు అస్సలే చేయకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన అనేక జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయంట. కాగా, భోజనం చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
తిన్న తర్వాత కొంత మంది సోమరితనంతో పడుకోవాలనుకుంటారు. కానీ ఇలా తిన్న తర్వాత వెంటనే పడుకోవడం అస్సలే మంచిది కాదంట. దీని వలన కడుపులోని ఆమ్లం, అన్నవాహికలోకి చేరుతుందంట. దీంతో గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తుతాయంట. మరీ ముఖ్యంగా గ్యాస్, ఉబ్బరం, వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట. అందుకే తిన్న తర్వాత వెంటనే పడుకోకూడదంట.

తిన్న తర్వాత కొంత మంది సోమరితనంతో పడుకోవాలనుకుంటారు. కానీ ఇలా తిన్న తర్వాత వెంటనే పడుకోవడం అస్సలే మంచిది కాదంట. దీని వలన కడుపులోని ఆమ్లం, అన్నవాహికలోకి చేరుతుందంట. దీంతో గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తుతాయంట. మరీ ముఖ్యంగా గ్యాస్, ఉబ్బరం, వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట. అందుకే తిన్న తర్వాత వెంటనే పడుకోకూడదంట.

2 / 5
కొంత మంది భోజనం తర్వాత ధూమపానం చేస్తుంటారు. దీని వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని చెబుతారు. కానీ ఇది శరీరానికి చాలా హానికరం అంట. ధూమపానం వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాదంట. దీని వలన మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయంట. అందుకే భోజనం చేసిన తర్వాత ధూమపానం అస్సలే చేయకూడదంట.

కొంత మంది భోజనం తర్వాత ధూమపానం చేస్తుంటారు. దీని వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని చెబుతారు. కానీ ఇది శరీరానికి చాలా హానికరం అంట. ధూమపానం వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాదంట. దీని వలన మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయంట. అందుకే భోజనం చేసిన తర్వాత ధూమపానం అస్సలే చేయకూడదంట.

3 / 5
అదే విధంగా కొందరు తిన్న వెంటనే వేగంగా నడుస్తుంటారు. కానీ ఇలా నడవడం అస్సలే మంచిది కాదంట. దీని వలన కడుపు నొప్పి అలాగే జీర్ణవ్యవస్థకు ఆటంకం కలుగుతుందంట. తిన్న వెంటనే వేగవంతమైన నడక అనేక ఇబ్బందులను తీసుకస్తుందంట. అందుకే తిన్న తర్వాత 20 నిమిషాల తర్వాత నిదానంగా నడవాలంట. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

అదే విధంగా కొందరు తిన్న వెంటనే వేగంగా నడుస్తుంటారు. కానీ ఇలా నడవడం అస్సలే మంచిది కాదంట. దీని వలన కడుపు నొప్పి అలాగే జీర్ణవ్యవస్థకు ఆటంకం కలుగుతుందంట. తిన్న వెంటనే వేగవంతమైన నడక అనేక ఇబ్బందులను తీసుకస్తుందంట. అందుకే తిన్న తర్వాత 20 నిమిషాల తర్వాత నిదానంగా నడవాలంట. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

4 / 5
ఇక కొంత మంది భోజనం చేసిన  వెంటనే టీ లేదా కాఫీ తాగుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంట. తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగడం వలన ఇది శరీరం ఖనిజాలను గ్రహించే సామార్థ్యాన్ని దెబ్బ తీస్తుంది. అలాగే టీ ఐరన్‌ను దెబ్బ తీస్తుంది. దీంతో రక్త హీనతకు గురి అయ్యే ఛాన్స్ ఉన్నదంట. అందుకే తిన్న వెంటనే ఎప్పుడు టీ తాగకూడదంట.

ఇక కొంత మంది భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంట. తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగడం వలన ఇది శరీరం ఖనిజాలను గ్రహించే సామార్థ్యాన్ని దెబ్బ తీస్తుంది. అలాగే టీ ఐరన్‌ను దెబ్బ తీస్తుంది. దీంతో రక్త హీనతకు గురి అయ్యే ఛాన్స్ ఉన్నదంట. అందుకే తిన్న వెంటనే ఎప్పుడు టీ తాగకూడదంట.

5 / 5
చాలా మంది తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. కానీ ఇది శరీరాని హాని కలిగిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని  వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుందంట. అదే విధంగా రక్త ప్రవాహాన్ని తగ్గించి జీర్ణక్రియ నెమ్మదించేలా చేస్తుందంట. అందుకే  తిన్న వెంటనే  స్నానం చేయకూడదంట. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత స్నానం చేయడం చాలా మంచిదంట.

చాలా మంది తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. కానీ ఇది శరీరాని హాని కలిగిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుందంట. అదే విధంగా రక్త ప్రవాహాన్ని తగ్గించి జీర్ణక్రియ నెమ్మదించేలా చేస్తుందంట. అందుకే తిన్న వెంటనే స్నానం చేయకూడదంట. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత స్నానం చేయడం చాలా మంచిదంట.