
దీపావళి పంఆరోగ్యాన్ని సకాలంలో జాగ్రత్తగా చూసుకోకపోతే భవిష్యత్తులో అది చాలా తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే మీరు కొన్ని ఆహారాలు తినే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ముఖ్యంగా ఈ కింది ఆహారాలు అదే పనిగా తీసుకుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.డగ చాలా మందికి ప్రత్యేకం. ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండగ సందర్భంగా దాదాపు ప్రతి ఇంట్లో తీపి వంటకాలు, స్వీట్లు కనిపిస్తాయి. కానీ, ఇటీవల మార్కెట్లో లభించే అనేక స్వీట్లలో కల్తీ జరుగుతుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో ముప్పు కలిగిస్తుంది. అయితే ఏ స్వీట్లు కల్తీ చేయబడతాయో, వాటిని ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం..

దీపావళి సందర్భంగా లభించే స్వీట్లలో గులాబ్ జామ్ ముఖ్యమైనది. మార్కెట్లో లభించే గులాబీ జామ్లో కల్తీ చక్కెర ఉంటుంది. ఈ చక్కెర పాల నుంచి కాకుండా పిండి పదార్ధం నుంచి తయారవుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం.

కాజు కట్లి చాలా మందికి ఇష్టమైన స్వీట్. దీనిని జీడిపప్పుతో తయారు చేసి వెండి ఆకుతో అలంకరిస్తారు. అయితే మార్కెట్లో లభించే కాజు కట్లిలలో వెండికి బదులుగా అల్యూమినియం ఉపయోగిస్తుంటారు

మిల్క్ కేక్ పాలతో తయారుచేసిన రుచికరమైన తీపి వంటకం. ఈ వంటకం పూర్తిగా పాలతో తయారు చేస్తారు. నేటి కాలంలో ఈ మిల్క్ కేక్ కూడా కృత్రిమ పాలతో కల్తీ చేస్తున్నారు.

సోన్ పాపడి త్వరగా చెడిపోదు. కాబట్టి పెద్ద మొత్తంలో పండగల టైంలో అమ్ముతుంటారు. కానీ ఈ స్వీట్ కూడా కల్తీ అవుతోంది. దీని తయారీకి స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా దాల్డా నెయ్యిని ఉపయోగిస్తున్నారు.