
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. వివో వై28 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్ను తీసుకొస్తోంది. గతంలో లాంచ్ చేసిన వివో వై27 5జీ స్మార్ట్ ఫోన్కు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది.

వివో వై28 5జీ స్మార్ట్ ఫోన్ను క్రిస్టల్ పర్పుల్, గ్లిట్టర్ ఆక్వా కలర్ ఆప్షన్స్లో తీసుకొచ్చారు. మొత్తం మూడీ వేరియంట్స్లో ఈ ఫోన్ను లాంచ్ చేయనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీకి సంబంధించి ఇప్పటి వరకు కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 13,999, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,499, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999గా ఉంది. ఈ ఫోన్ కొనుగోలు సమయంలో రూ. 1500 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అందించనున్నారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ సెట్తో పని చేయనుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగా పిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉండనున్నట్లు సమాచారం.

ఇక వివో వై28 5జీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్లో 6.64 ఇంచెస్తో కూడిన ఫుల్ హెచ్డీ+ కెమెరాను అందించనున్నారు. 1080×2388 పిక్సెల్స్ రిజల్యూషన్తో కూడిన ఎల్సీడీ ప్యానెల్ డిస్ ప్లేను ఇచ్చారు.