
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తాజాగా మరో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. ఇటీవల వరుసగా కొత్త ఫోన్లను తీసుకొస్తున్న ఈ సంస్థ వివో వీ23 ఈ 5జీ ఫోన్ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఆండ్రాయడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ను అందించారు. ఇక 6.44 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే ఈ ఫోన్ సొంతం.

ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఎస్వోసీ ప్రాసెసర్తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ చేసే 4050 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ఫోన్లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 44 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్తో వచ్చిన ఈ ఫోన్ అసలు రూ. 28,990 కాగా ఆఫర్లో భాగంగా వినియోగదారులు రూ. 25,990కే అందుబాటులోకి రానుంది.