
5.5 అంగుళాల టచ్ స్క్రీన్తో వచ్చే నోకియా 2.0 ఫోన్ 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. 8 ఎంపీ బ్యాక్ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వీ 8 ఆధారంగా పని చేసే స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్తో పని చేస్తుంది. ఈ ఫోన్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ రావడంతో పని తీరు బాగా ఆకట్టుకుంటుంది.

2 జీబీ + 32 జీబీ వేరియంట్లో అందుబాటులో ఉండే ఐటెల్ ఏ 23 ఎస్ స్మార్ట్ ఫోన్లో 3020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 5 అంగుళాల డిస్ప్లేతో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ గో 11తో పని చేస్తుంది. అలాగే ఈ ఫోన్ 15 భాషలకు మద్దతునిస్తుంది. అలాగే మీరు కొనుగోలు చేసిన 100 రోజుల లోపు ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ను కూడా పొందవచ్చు.

3 జీబీ + 32 జీబీ వేరియంట్లో వచ్చే ఐ కాల్ జెడ్ 1 4 జీ ఫోన్ 5.5 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. డ్యుయల్ 4 జీ సిమ్తో పని చేసే ఈ ఫోన్ వెనుక వైపు 8 ఎంపీ కెమెరా, ముందు వైపు 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 8.1తో పని చేస్తుంది.

ఐటెల్ ఏ 60 ఎస్ ఫోన్ 4 జీబీ +64 జీబీ వేరియంట్లో అందుబాటులో ఉంటుంది. 8 ఎంపీ బ్యాక్ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ను ఆకర్షణీయంగా చేస్తుంది. 6.6 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లేతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాకర్ వంటి భద్రతా ఫీచర్లతో వస్తుంది.

మైక్రోమాక్స్ భారత్ 2 ఫోన్ ఆల్ ఇన్ వన్ సూపర్ డివైజ్గా పని చేస్తుంది. నాలుగు ఇంచుల డిస్ప్లేతో పని చేసే ఈ ఫోన్ 5 ఎంపీ బ్యాక్ కెమెరాతోపాటు 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.