చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్నో భారత మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చింది. టెక్నో పొవా 5, టెక్నో పొవా 5 ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ రెండు ఫోన్లు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.
ఈ రెండు ఫోన్లలో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో తీసుకొచ్చారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఈ ఫోన్ స్క్రీన్స్ ప్రత్యేకత.
ఈ రెండింటిలోనూ మీడియాటెక్ హిలీయో జీ 99 ప్రాసెసర్ను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ ఫోన్లు పనిచేస్తాయి.
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ డ్యూయల్ కెమెరా సెటప్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
టెక్నో పొవా 5 హరికేన్ బ్లూ, అంబర్ గోల్డ్, మెక్కా బ్లాక్ కలర్స్లో అందుబాటులో ఉన్నాయి. టెక్నో పొవా 5ప్రో విషయానికొస్తే.. వేరియంట్ సిల్వర్ ఫాంటసీ, డార్క్ ఇల్లుషన్ కలర్స్లో ఉన్నాయి. డ్యుయల్ 4జీ ఓల్ట్, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్సీ, 3.5 ఆడియో కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.