ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో తాజాగా భారత్లో కొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. త్వరలోనే ఆన్లైన్లో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ను తక్కువ బడ్జెట్లో విడుదల చేశారు.
గత నెల ఫిలిప్పీన్స్లో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ను త్వరలోనే భారత్లో తీసుకురానున్నారు. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ ధర 8,999 ఫీలిప్పీన్ పెసోలుగా ఉంది. అంటే మనకరెన్సీలో రూ. 13,300గా ఉండనుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేను అందించారు. ఈ స్మార్ట్ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ జీ88 ప్రాసెసర్తో పనిచేయనుంది.
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. డ్యుయల్ స్టీరియో స్పీకర్లను ఈ మొబైల్ ప్రత్యేక ఫీచర్లుగా చెప్పొచ్చు.
ఈ స్మార్ట్ఫోన్లో 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 7000 ఎమ్ఏహెచ్ సామర్థ్యమనున్న బ్యాటరీ ఈ ఫొన్ సొంతం.