దేశంలో 5జీ సేవలు విస్తరిస్తోన్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు 5జీ ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో తక్కువ బడ్జెట్లో 5జీ స్మార్ట్ ఫోన్స్ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్సంగ్ సైతం కొత్త ఫోన్ను లాంచ్ చేసింది.
సామ్సంగ్ గ్యాలక్సీ ఎఫ్14 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ శుక్రవారం భారత్లో లాంచ్ చేశారు. అయితే మొదటి సేల్ మాత్రం మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అధికారిక వెబ్సైట్తో పాటు, ఈ కామర్స్ సైట్స్లో అందుబాటులోకి రానుంది.
ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 12,990 కాగా, 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 14,990కి అందబాటులోకి రానుంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఈ ఫోన్ ప్రత్యేకత.
ఆండ్రాయిడ్ 13 వన్ యూఐ 5 ద్వారా పనిచేసే ఈ స్మార్ట్ఫోన్లో 5nm Exynos 1330 చిప్సెట్ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు.
ఇక సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్లో 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.