
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ మార్కట్లోకి కొత్త స్మార్ట్ఫోన్ను తీసుకొస్తోంది. గ్యాలక్సీ ఏ34 పేరుతో లాంచ్ చేస్తున్న ఈ స్మార్ట్ఫోన్ 5జీ నెట్వర్క్తో పనిచేస్తుంది.

సామ్సంగ్ గ్యాలక్కీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్ డిస్ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ను నాలుగు రంగుల్లో లభించనుంది. సిల్వర్, వయొలెట్, లైమ్, గ్రాఫైట్ కలర్స్లో తీసుకురానున్నారు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ ఫోన్లో శాంసంగ్ వన్ యూఐ 5.1 వెర్షన్తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ను మొత్తం వేరెయంట్స్లో లాంచ్ చేయనున్నారు.

Samsung

కెమెరా విషయానికొస్తే ఇందులో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ధర విషయానికొస్తే ప్రారంభం ధర రూ. 30 వేలుగా ఉండొచ్చని తెలుస్తోంది.