
త్వరలో భారత్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో 5జీ ఆధారిత ఫోన్స్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్సంగ్ గ్యాలక్సీ ఎమ్33 పేరుతో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది.

ఈ స్మార్ట్ ఫోన్లో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ + ఇన్ఫినిటీ-వీ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఈ ఫోన్ మరో ప్రత్యేకత.

ఆక్టాకోర్ 5ఎన్ఎమ్ ఎగ్జినోస్ ప్రాసెసర్పై పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇందులో 25 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 50 మెగా పిక్సె్ల్స్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ఫోన్ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ ధర రూ. 17,999 కాగా, 8జీబీ+128 జీబీ ఫోన్ ధర రూ. 19,999గా ఉంది.