
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి ఒప్పో ఏ79 పేరుతో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. ఈ 5జీ స్మార్ట్ ఫోన్ నేటి నుంచే (అక్టోబర్ 28) అందుబాటులోకి వచ్చింది. అమెజాన్తో పాటు, ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ను అమ్మకానికి తీసుకొచ్చారు.

ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999 కాగా ప్రస్తుతం పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 4000 వరకు డిస్కౌంట్ను అందిస్తోంది. ఈ లెక్కన ఈ ఫోన్ను రూ. 15 వేలకే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్తో కూడిన ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్ను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్, 6150నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ స్క్రీన్ సొంతం.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీ ప్రాసెసర్ను అందించారు. ఇక బ్యాటరీన విషయానికొస్తే ఇందులో 33 వాట్స్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఇన్డిస్ప్లేగా అందించారు.