
మొదట్లో కేవలం హై ఎండ్ ఫోన్లను విడుదల చేస్తూ వచ్చి వన్ప్లస్ తాజాగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి వన్ప్లస్ నార్డ్ 2టీ పేరుతో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది.

ఈ స్మార్ట్ రెండు వేరియంట్లలో లభించనుంది. 8 జీబీ ర్యామ్+125 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 28,999కాగా, 12 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ ధర రూ. 33,999గా ఉండనుంది. లాంచింగ్ ఆఫర్లో భాగంగా రూ. 1500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్లో 90 హెచ్జెడ్ రిఫ్రెషర్ రేట్తో కూడిన 6.43 ఇంచెస్ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్లో 4500 ఎంఏహెచ్ డ్యూయల్-సెల్ బ్యాటరీ, 80 వాట్స్, సూపర్ వూక్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీ+8 ఎంపీ + 2 ఎంపీలతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను అందించారు.