ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలో భారత్లో బుధవారం మోటో ఎడ్జ్ 50 ప్రో పేరుతో కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ఫోన్లో వైర్లెస్ టర్బో చార్జింగ్ వంటి అధునాత ఫీచర్లను అందించారు.
ఫీచర్ల విషయానికొస్తే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్లో 6.7 ఇంచెస్తో కూడిన 1.5కే పీఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్ప్లేను అందించారు. 144 హెజ్జెడ్ రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ ఈ స్క్రీన్ సొంతం.
ఇక ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓసీ ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హలో యూఐతో పనిచేసే ఈ ఫోన్లో 125 వాట్స్ వైర్డ్, 50 వాట్స్ వైర్లెస్ టర్బో ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో ఏఐ ఫీచర్లతో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్, 13 మెగాపిక్సెల్స్, 10 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో ఏఐ ఫీచర్లతో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్, 13 మెగాపిక్సెల్స్, 10 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.