చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐటెల్ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఐటెల్ ఏ70 పేరుతో ఈ ఫోన్ను తీసుకురానున్నారు. బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేయనున్న ఈ ఫోన్ను జనవరి చివరి నాటికి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇంతకీ ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐటెల్ ఐటెల్ ఏ70 పేరుతో ఈ ఫోన్ను తీసుకురానున్నారు. 12 జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 7,500గా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వర్చువల్గా ర్యామ్ను మరో 4జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ సెగ్మెంట్లో లాంచ్ అవుతోన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇదేనని ఐటెల్ చెబుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ను బ్రిలియంట్ గోల్డ్, స్టైలిష్ బ్లాక్, ఫీల్డ్ గ్రీన్, అజూర్ బ్లూ కలర్ ఆప్షన్స్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇక ఐటెల్ ఏ70 ఇతర ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.6 ఇంచెస్తో కూడిన డిస్ప్లేను అందించనున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ ఫోన్లో ఆక్టాకోర్ యూనిసోక్ టీ603 ప్రాసెసర్ను అందిస్తారు.
కెమెరా విషయానికొస్తే ఐటెల్ ఏ70 స్మార్ట్ ఫోన్లో 13 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. ఎల్ఈడీ ఫ్లాష్ ఈ కెమెరా సొంతం. అలాగే వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ఈ స్మార్ట్ ఫోన్లో 8 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందిస్తారు.