
భారత్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం బోట్.. తాజాగా మార్కెట్లోకి బోట్ లునార్ కామెట్ పేరుతో కొత్త వాచ్ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 1299గా ఉంది. ఇందులో హెచ్డీ డిస్ప్లేను అందించారు.

బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ సహాయంతో పనిచేసే ఈ స్మార్ట్ వాచ్లో ఇన్బుల్ట్గా స్పీకర్తో పాటు, మైక్ను కూడా అందించారు. రాయల్ ఆరెంజ్, డీప్ పర్పుల్, ఆలివ్ గ్రీన్, యాక్టివ్ బ్లాక్ కలర్స్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

సెప్టెంబర్ 30వ తేదీ (నేటి) నుంచి ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకానికి రానుంది. అమెజాన్తో పాటు బోట్ అధికారిక వెబ్సైట్ నుంచి ఈ వాచ్ను కొనుగోలు చేసుకోవచ్చు.

ఇక ఇందులో 1.39 ఇంచెస్తో కూడిన హెచ్డీ రౌండ్ డిస్ప్లే డిస్ప్లేను ఇచ్చారు. 500 నిట్స్ బ్రైట్నెస్ 240 x 240 పిక్సెల్ల రిజల్యూషన్ డిస్ప్లేను ఇచ్చారు. ఎలాంటి టచ్ లేకుండా కేవలం చేతిని పైకి లేపడం ద్వారా వాచ్ డిస్ప్లే ఆన్ కావడం ఈ వాచ్ ప్రత్యేకత.

ఇక ఈ వాచ్తో నేరుగా ఫోన్లు సైతం మాట్లాడుకోవచ్చు. అలాగే ఇందులో 10 కాంటాక్ట్ల వరకు సేవ్ చేసుకోవచ్చు. రన్నింగ్, సైక్లింగ్, స్లీప్, హార్ట్ రేట్, ఎస్పీఓ2 వంటి హెల్త్ ఫీచర్స్ అందించారు. ఈ స్మార్ట్ వాచ్ 100ఎఇపైగా స్పోర్ట్స్ మోడల్స్కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా, మ్యూజిక్ కంట్రోల్, స్టాప్వాచ్, వెదర్ అప్డేట్స్ వంటి ఫీచర్స్ను అందించారు.