ప్రముఖ ఇండియన్ గ్యాడ్జెట్ బ్రాండ్ బోట్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్ను లాంచ్ చేసింది. బోట్ స్ట్రోమ్ ప్రో కాల్ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్లో అదిరిపోయే ఫీచర్లను అందించింది.
ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.78 ఇంచెస్ 2.5 కర్వ్డ్ గ్లాస్తో కూడి ఆమెఎల్ఈడీ డిస్ప్లేను ఇచ్చారు. బ్లూటూత్ కాలింగ్ ఈ వాచ్ ప్రత్యేకత.
వాచ్ సహాయంతో మ్యూజిక్, కెమెరాను కంట్రోల్ చేయొచ్చు. 100కుపైగా క్లౌడ్ బేస్డ్ వాచ్లను అందించారు. ఎస్పీఓ2, హార్ట్ రేట్ మానటరింగ్, స్లీప్ ట్రాకర్ వంటి హెల్త్ ఫీచర్లను అందించారు.
ఒక బ్యాటరీ విషయానికొస్తే ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏడు రోజుల నాన్స్టాప్గా పనిచేస్తుంది. 30 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అవుతుంది. ఐపీ68 రేటింగ్తో కూడిన వాటర్, డస్ట్ రెసిస్టెంట్స్ అందించారు.
ఇక ధర విషయానికొస్తే బోట్ స్ట్రామ్ ప్రో కాల్ ధర రూ. 3,799గా ఉంది. ఫ్లిప్కార్ట్తో పాటు, బోట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఆఫర్లో భాగంగా రూ. 3,499కి అందిస్తున్నారు.