డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ సౌతాంప్టన్లోని అగాస్ బౌల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియంలో 25,000 మంది సామర్థ్యం ఉంది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో మొత్తం 6 టెస్ట్ మ్యాచ్లు భారతదేశం, న్యూజిలాండ్ల మధ్య జరిగాయి. ఈ మైదానంలో మొదటి టెస్ట్ 16 జూన్ 2011న ఇంగ్లాండ్ మరియు శ్రీలంక మధ్య జరిగింది.
ఈ స్టేడియంలో ఇంగ్లాండ్ చేసిన స్కోర్ పెద్దది. 2020లో పాకిస్తాన్తో జరిగిన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 583 పరుగులు చేసింది ఇంగ్లాండ్. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
అయితే ఈ స్టేడియంలో అత్యల్ప స్కోరును నమోదు చేసిన రికార్డు మాత్రం టీమిండియా పేరుతో ఉంది. 2014 లో ఇంగ్లాండ్లో జరిగిన రెండవ ఇన్నింగ్స్లో కేవలం 178 పరుగులకే ఆలౌట్ ధోనీ సేన. ఈ మ్యాచ్ను ఇంగ్లాండ్ 266 పరుగుల తేడాతో గెలుచుకుంది.
ఈ స్టేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు మాత్రం ఇంగ్లాండ్ బ్యాట్స్ మాన్ జాక్ క్రౌలీ పేరుతో ఉంది. 2020 లో పాకిస్థాన్పై 267 పరుగులు చేశాడు. ఇందులో 34 ఫోర్లు, 1 సిక్సర్లు ఉన్నాయి. ఈ సమయంలో అతను 393 బంతులు ఆడాడు.
సౌతాంప్టన్లో ఉత్తమ బౌలింగ్ రికార్డులను క్రియేట్ చేసింది మాత్రం వెస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జాసన్ హోల్డర్. జూలై 2020లో ఇంగ్లాండ్తో ఆడిన టెస్టులో 42 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ను వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై గెలిచింది.
సౌతాంప్టన్లో టీమిండియా రికార్డులు అద్భుతంగా లేవు. విరాట్ కోహ్లీ జట్టు గతంలో ఇక్కడ 2 మ్యాచ్లు ఆడింది. అయితే ఈ రెండు మ్యాచులు ఓడిపోయింది. అదే సమయంలో న్యూజిలాండ్ ఇంతవరకు ఈ స్టేడియంలో అడిన రికార్డు లేదు.